జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా ఆమ్రపాలి: ఐపీఎస్, ఐఏఎస్ల బదలీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్లను బదలీ చేస్తు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ కమిషనర్గా రాహుల్ బొజ్జాను నియమించారు. ప్రస్తుతం కమిషనర్గా పని చేస్తున్న డాక్టర్ జగన్మోహన్ గురువారం పదవీ విరమణ చేస్తున్నారు.
ఆయన స్థానంలో కొత్త కమిషనర్గా రాహుల్ బొజ్జా బదిలీ అయ్యారు. గురువారం ఆయన పదవీ బాధ్యతలు చేపడతారు. వరంగల్ అర్బన్ కలెక్టర్గా పని చేసిన ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్లను కూడా బదలీ చేసింది. రామగుండం కమిషనర్గా సత్యనారాయణ, వనపర్తి ఎస్పీగా అపూర్వారావు, జగిత్యాల ఎస్పీగా సింధూశర్మ, సూర్యాపేట ఎస్పీగా వెంకటేశ్వర్లు, సీఐడీ ఎస్పీగా ప్రకాశ్ జాదవ్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా సునీల్ దత్, కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా మురళీకృష్ణ, సౌత్ జోన్ డీసీపీగా అంబర్ కిషోర్ ఝా, హైదరాబాద్ అడిషనల్ సీపీ అడ్మిన్గా శివప్రసాద్ నియమించారు.