వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి జైపాల్‌రెడ్డి: ఆ ఇద్దరు టిడిపి నేతలకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

రంగం సిద్దం చేస్తున్న కాంగ్రెస్

హైదరాబాద్: టిడిపి సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు మక్తల్ సీటు ఇస్తామని మాజీ మంత్రి చిన్నారెడ్డి చెప్పారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

తెలంగాణలో కీలకమైన టిడిపి నేతలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ఆ పార్టీకి చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది.ఇప్పటికే తెలంగాణలో వలసలతో టిడిపి తీవ్రంగా నష్టపోయింది.టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి కీలకమైన టిడిపి నేతలు వలసలు వెళ్ళారు.

2019 ఎన్నికలకు తెలంగాణలో అన్ని రాజకీయపార్టీలు సిద్దమయ్యాయి. ఈ తరుణంలో టిడిపి నేతలపై కాంగ్రెస్ పార్టీ వల విసురుతోంది. అయితే కొందరు కీలక నేతలను తమ పార్టీల్లోకి చేరాలని సంప్రదింపులు జరుపుతోంది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి చిన్నారెడ్డి మీడియాతో ఈ విషయమై చిట్ చాట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టిడిపి నేతలకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు.

 రావులకు మక్తల్ సీటిస్తాం

రావులకు మక్తల్ సీటిస్తాం

టిడిపి సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు మక్తల్ సీటు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు అవసరమని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు..

 దయాకర్‌రెడ్డితో చర్చలు

దయాకర్‌రెడ్డితో చర్చలు

టిడిపి మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వనిస్తున్నట్టు చిన్నారెడ్డి చెప్పారు. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో పాటు దయాకర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని చిన్నారెడ్డి ప్రస్తావించారు.

నాగం‌కు మద్దతిస్తాం

నాగం‌కు మద్దతిస్తాం

ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరిసారిగా మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చెబుతున్నారని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి గుర్తు చేశారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దఫా నాగర్‌కర్నూల్ నుండి నాగం‌కు మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో దామోదర్ రెడ్డికి టిక్కెట్టు

వచ్చే ఎన్నికల్లో దామోదర్ రెడ్డికి టిక్కెట్టు

నాగం జనార్ధన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నందున, ఆ సమయంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కొడుకుకు టిక్కెట్టు ఇస్తామన్నారు. ఈ ఎన్నికల్లో నాగం జనార్ధన్ రెడ్డికి మద్దతివ్వాలని దామోదర్ రెడ్డిని కోరుతామన్నారు.వచ్చే ఎన్నికల్లో దామోదర్ రెడ్డి కొడుకుకు నాగం మద్దతు కోరుతామన్నారు.

English summary
ngress party leader Chinna Reddy said that if Tdp leader Ravula Chandrasekhar Reddy join in congress we will allot Makthal assembly seat. Chinna Reddy chit chat with media on Friday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X