వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16 స్థానాల్లో గెలుస్తున్నాం..! పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చిన కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాల్లో గెలువబోతున్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో విజయంపై పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకోవాలని ఆయన సూచించారు. గురువారం 17 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని బుధవారం ఆయన తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. జిల్లాల్లోని మంత్రులు, పార్టీ అభ్యర్థులు, శాసనసభ్యులు, మండలి సభ్యులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతుందని అన్నారు.

We will win 16 places.!KCR to assure party cadre..!

శాసనసభ ఎన్నికల మాదిరే లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ ఏకపక్షంగా ఉంటాయన్నారు. విపక్షాలు మళ్లీ చిత్తుగా ఓడిపోతాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఓట్ల లెక్కింపు వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు ఓట్ల లెక్కింపు ఏజెంట్లకు అన్ని విధాలా జాగ్రత్తలు చెప్పాలన్నారు. ఎక్కడయినా సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణభవన్‌ వద్ద ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని, ఏమైనా సందేహాలుంటే సంప్రదించాలని అన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల విధానానికి టీఆర్ఎస్ పూర్తిగా మద్దతు ఇచ్చిందని, విపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు.

English summary
TRS chief KCR said that we will win 16 seats in the Lok Sabha elections. He also suggested that party cadre should be made throughout the state in the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X