రూ.50కే చీప్ లిక్కర్: ట్రెండ్ సెట్ చేసిన సోము వీర్రాజు: ఆడేసుకున్న కేటీఆర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఏ కారణంతో ప్రజా ఆగ్రహ సభను నిర్వహించారో గానీ.. దాని ఉద్దేశం మాత్రం నెరవేరనట్టే కనిపిస్తోంది. పైగా మరంత చులకన కావాల్సి వచ్చింది. కోరి వివాదాలను కొని తెచ్చుకున్నట్టయింది ఏపీ బీజేపీ నాయకుల పరిస్థితి. ఎప్పుడూ లేనివిధంగా ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆయన పేరు వైరల్గా మారింది. జాతీయ మీడియా సైతం ఆయన ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. సోము చేసిన వ్యాఖ్యలతో సభ ఉద్దేశం దారి మళ్లినట్టే.

ఈ పాయింట్ హైలైట్..
దీనికంతటికీ కారణం- సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలేననేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. చీప్ లిక్కర్పై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సోము వీర్రాజు చేసిన ప్రసంగంలో చీప్ లిక్కర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతీయ మీడియా సైతం ఈ పాయింట్ను బాగా హైలైట్ చేసింది. పెద్ద ఎత్తున వివాదాలు, విమర్శలకు కేంద్రబిందువయింది.

రూ.50కే చీప్ లిక్కర్..
2024లో
తాము
అధికారంలోకి
వస్తే..
చీప్
లిక్కర్ను
70
రూపాయలకే
ఇస్తామని
సోము
వీర్రాజు
చేసిన
ప్రకటన
రాష్ట్ర
రాజకీయాల్లో
చర్చనీయాంశమైంది.
తమ
ప్రభుత్వం
ఏర్పాటైనప్పుడు
ఆర్థిక
పరిస్థితి
బాగుంటే
50
రూపాయలకే
చీప్
లిక్కర్
ఇస్తామనీ
చెప్పుకొచ్చారాయన.
రాష్ట్రంలో
కోటిమంది
తాగుతున్నారని,
వారంతా
బీజేపీకి
ఓటు
వేయాలని
విజ్ఞప్తి
చేశారు.
ఇప్పుడీ
క్లిప్పింగ్
వైరల్గా
మారింది.
సోషల్
మీడియాలో
హల్చల్
చేస్తోంది.
వందల
సంఖ్యలో
ట్వీట్లు,
రీట్వీట్లు
పడుతున్నాయి..దీనిమీద.

కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. వహ్..వాట్ ఎ షేమ్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీ సరికొత్తగా మరింత దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. 50 రూపాయలకే చీప్ లిక్కర్ను సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానంగా పెట్టుకుందా లేక ఎలాగూ అధికారంలోకి రాదని నిరాశలో కూరుకుపోయిన రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారా అని ప్రశ్నించారు.

బీజేపీ జాతీయ విధానమా..?
అధికారంలోకి రాలేమని తెలుసుకున్న రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ 50 రూపాయలకు చీప్ లిక్కర్ ఇచ్చేలా జాతీయ విధానాన్ని రూపొందించుకుందని చురకలు అంటించారు. జాతీయ పార్టీకి రాష్ట్రశాఖ అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోము వీర్రాజు చీప్ లిక్కర్ కామెంట్స్ వీడియోను యాడ్ చేసిన ఓ ట్వీట్కు తన అభిప్రాయాలను జత చేసి రీట్వీట్ చేశారు.

ట్రెండింగ్లో సోము పేరు..
గతంలో ఎప్పుడూ లేనివిధంగా సోము వీర్రాజు పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #SomuVeerraju అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను కవర్ చేయని జాతీయ మీడియా దాదాపుగా లేదు. అన్ని మీడియా సంస్థలు ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇచ్చాయి. మొత్తంగా చూస్తే- ప్రజా ఆగ్రహ సభను చీప్ లిక్కర్ కామెంట్స్.. డామినేట్ చేశాయి. అసలు పాయింట్ గాలికి ఎగిరిపోయింది. ఈ కామెంట్స్కే ప్రాధాన్యత ఇచ్చాయి మీడియా సంస్థలు.