వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాస్వమ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు ఎక్కడిది..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్‌ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. వారు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అనడం సరికాదన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన జడ్పీ ఛైర్మన్‌, ఛైర్‌ పర్సన్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆందోళనలపై ఆయన మాట్లాడారు.

మార్పుడు రాజకీయాలను ప్రారంభించిందే ఆ పార్టీ అని కాంగ్రెస్‌ను విమర్శించారు. 2004 ఎన్నికల్లో 26 మంది తెరాస ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని ఆ పార్టీలో కలుపుకోలేదా? అని ప్రశ్నించారు. అప్పట్లో మూడింట రెండొంతుల మంది లేకపోయినా సరే నిరంకుశంగా వ్యవహరించలేదా? అని నిదీశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తమ పార్టీ ఎమ్మెల్సీలను, ఎంపీలను చేర్చుకోవడం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఆ పార్టీ నేతలకు గుర్తు రాలేదా? అన్నారు.

Where is the Eligibility for Congress to Speak about democracy? KTR Straight question..!!

వాళ్లతో పోలిస్తే మేం చాలా మర్యాదగా వ్యవహరించామన్నారు. సీఎల్పీ విషయంలో స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారని, అందులో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు. విలీనంపై కాంగ్రెస్‌ నేతలు కోర్టుకెళుతుండడంపై ప్రశ్నించగా.. ఏం జరుగుతుందో చూద్దాం అని సమాధానమిచ్చారు. 32 జిల్లా పరిషత్‌లకు గానూ అన్నింటా టీఆర్ఎస్ గెలుపొందిందని, ఇంతటి ఏకపక్ష విజయం అందించినందుకు ప్రజలకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో తెరాస కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. 32 జిల్లా పరిషత్‌లతో పాటు, 85 శాతానికి పైగా ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుందన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పిన ఆ రెండు ప్రధాన పార్టీలు.. దారుణ ఓటమి చవిచూశాయన్నారు. ఆరు జిల్లాల్లో తెరాస క్లీన్‌ స్వీప్‌ చేసిందన్నారు. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎంపికలో టీఆర్ఎస్ సామాజిక సమతూకం పాటించిందన్నారు. 50 శాతానికి పైగా ఛైర్మన్‌ స్థానాలను వెనుకబడిన వర్గాలకు కేటాయించినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని విజేతలకు సూచించారు.గ్రామస్వరాజ్యం సాధనే లక్ష్యంగా పనిచేయాలని ఎన్నికైన అభ్యర్థులకు సూచించారు.

English summary
KTR spoke of the Congress leaders' concerns over the merger of the CLP. The Congress has criticized the party as the change of politics. In the 2004 elections, if the TRS MLAs won 26, did not the 10 people join the party?"He said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X