పసుపుబోర్డు ఏది : ఎంపీ కవిత
బీజేపీ మరోసారి భారతీయ ఝూట్ పార్టీ అని నిరుపించుకుందని ఎంపీ కవిత విమర్శించారు. ఇటివల ఆర్మూర్ లో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో బీజేపీ నేత రాంమాధవ్ మాట్లాడుతూ .. పసుపు బోర్డు ఏర్పాటును తమ మ్యానిఫేస్టోలో పెడతామని చెప్పారు, కాని నేడు ప్రకటించిన మ్యానిఫెస్టో లో దాని ప్రస్థావన లేదని ఆమే మండిపడ్డారు . దీంతో ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.
ఆయనకు చిత్తశుద్ది ఉంటే పసుపు బోర్డు అంశాన్ని ఇప్పటికైన మ్యానిఫెస్టోలో చేర్చాలని ఆమే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తోందని అన్నారు.అప్పుడు తాము పసుపు బోర్డు సాధించుకుని తీరుతామని కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఆమే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇస్తామని ఆమే హమి ఇచ్చారు. ఈనేపథ్యంలోనే కులవృత్తులకు భారిగా నిధులు కేటాయిస్తామని అన్నారు.