వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్యూట్ కల్నల్ సంతోష్ బాబు: నాలుగేళ్ల కుమారుడు, భార్య కన్నీటి వీడ్కోలు..

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ చైనా ముష్కరుల దాడిలో ఆసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబుకు కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో ఆర్మీ, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. కరోనా వైరస్ సందర్భంగా కొద్దిమందికే అనుమతి ఇచ్చిన వందలాది మంది అంత్యక్రియలు నిర్వహించే చోటుకు వచ్చి, తుది వీడ్కోలు పలికారు. సంతోష్ తండ్రి చితీకి నిప్పుపెట్టగా.. అతని నాలుగేళ్ల కుమారుడు అనిరుధ్ తల్లితో కలిసి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు. ఈ ఘట్టం చూసిన ప్రతీ ఒక్కరు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

 Wife, 4-Year-Old Son Say Tearful Goodbye To Colonel..

ఆర్మీ మూడు రౌండ్లు కాల్పులు జరిపాక.. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. అయితే సంతోష్ కుమారుడు అనిరుధ్, భార్య సెల్యూట్ చేసి.. వీడ్కోలు పలికారు. కంటినుంచి వస్తోన్న దు:ఖాన్ని ఆపుకొని మరీ.. కన్నీటి వీడ్కోలు తెలిపారు. ఆర్మీ గౌరవ వందనం తర్వాత.. భారత్ మాతా కీ జై అనే నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది. సంతోష్ బాబు అమర్ రహే, వందేమాతరం అంటూ నినాదించారు. అంతకుముందు 6 కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో ప్రజలు పూలు చల్లారు.

Recommended Video

Shikhar Dhawan Feeds హంగ్రీ ఏనిమల్స్ With ఫ్యామిలీ!

సంతోష్ బాబు‌కు గౌరవసూచకంగా గురువారం షాపులను మూసివేశారు. 45 ఏళ్ల తర్వాత తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ వద్ద చైనాకు చెందిన జవాన్లు కల్నల్ సంతోష్ బాబు అండ్ టీమ్‌పై రాళ్లతో దాడిచేశారు. దీంతో 20 మంది జవాన్లు వీరమరణం పొందారు.

English summary
Thousands attended the funeral today in Telangana of Colonel Bikkumalla Santosh Babu, who died for his country in the deadly clash with China at the Galwan Valley in Ladakh on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X