యాంకర్తో ఇంట్లోనే సహజీవనం: భర్తపై భార్య ఫిర్యాదు
హైదరాబాద్: మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని ఓ టీవీ సీరియల్ డైరెక్టర్ భార్య మంగళవారం నాడు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ప్రముఖ టీవీ సీరియల్ డైరెక్టర్ అయిన అతని పైన భార్య ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
ఓ మహిళా టీవీ యాంకర్తో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని తమ ఇంట్లోనే సహజీవనం చేస్తున్నాడని ఆమె వాపోయారు. వివాహేతర సంబంధం వల్ల తన భర్త తనను ఇంట్లో నుంచి గెంటివేసాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త, సదరు టీవీ యాంకర్ తనను మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
ల్యాప్టాప్, ఎల్ఈడీ టీవీలు చోరీలు చేస్తున్న నేరస్తుల అరెస్టు
ల్యాప్ట్యాప్లు, ఎల్ఈడీ టీవీలు చోరీ చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను టప్పాచబుత్ర పోలీసులు అరెస్టు చేశారు. కార్వాన్ రాంసింగపురా ప్రాంతానికి చెందిన భువనగిరి రాజు, కార్వాన్ జాఫర్ గూడ ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ గత కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నారు.
వీరిద్దరు సోమవారం యాదవ భవన్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించారు. వారు చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రెండు ల్యాప్టాప్లు, ఎల్ఈఢీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. రిమాండుకు తరలించారు.