వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరాతకం:ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు, భార్యను ఏం చేశాడంటే?

ప్రేమించి వివాహం చేసుకొన్న భార్యను భర్త గొంతుకోసి చంపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఖమ్మం:ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. అయితే ఏమైందో ఏమో కాని, భార్యను కత్తితో గొంతుకోసి చంపేశాడు భర్త.ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్యను ఎందుకు హత్య చేశాడో కారణాలు తెలియడం లేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జజ్ులరావుపేటకు చెందిన కొణతాల వెంకన్నట్రాలీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

వెంకన్న తన బంధువు అప్పారావు కూతురు రేణుకను ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. ఈ నెల 11వ, తేదిన శ్రీరాంనగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు.

murder

శుక్రవారం రాత్రి భార్య, భర్తల మధ్య ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణ కారణంగా వెంకన్న తన భార్య రేణుకను కత్తితో గొంతు కోసి చంపాడు.

రేణుక మృతదేహన్ని ఇంట్లోనే వదిలేసి ఆయన ఇంటికి తాళం వేసి వెళ్ళాడు.అయితే అతను ఇంటికి తాళం వేసి వెళ్తుండగా ఇంటి యజమాని ఆయనను ప్రశ్నిస్తే వెంకన్న సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు.

రేణుక కుటుంబసభ్యులు ఆమెకు ఫోన్ చేస్తే ఆమె నుండి సమాధానం లేదు.దీంతో తల్లి వచ్చి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది.

అనుమానం వచ్చి తాళం పగులగొట్టి చూస్తే రక్తపు మడుగులో రేణుక మృతదేహం పడి ఉంది. కూరగాయలు కోసే చాకుతో రేణుక గొంతును కోసి వెంకన్న హత్య చేశాడు. సమాచారం తెలుసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు

English summary
wife murderd by her husband in khammam. venkanna working as a trally driver, he marrage with renuka. venkanna murderd his wife on saturday.police searching for venkanna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X