టెక్కీ ఆత్మహత్యలో కొత్త కోణం, భార్య అరెస్ట్: ప్రియుడితోనే ఉంటానని భర్తతో ఫోన్ సంభాషణ
హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టెక్కీ ప్రశాంత్ సూసైడ్ కేసులో అతని భార్య పావనిని పోలీసులు అరెస్టు చేశారు. పావని వేధింపుల వల్లే భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించి, ఆమెను బుధవారం అరెస్ట్ చేశారు.
భార్య వివాహేతర బంధం, ఎంత చెప్పినా..: పరువుపోతోందని టెక్కీ ఆత్మహత్య
ప్రియుడు ప్రణయ్తో వివాహేతర సంబంధం వల్లే ఆమె భర్తను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్, పావనిల ఫోన్ సంభాషణ వెలుగు చూసింది. దీంతో పాటు అథని సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. దీని ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, విచారించారు.
భర్త ప్రశాంత్తో జరిగిన ఫోన్ సంభాషణలో భార్య పావని.. తాను ప్రియుడు ప్రణయ్తోనే ఉంటానని తేల్చి చెప్పింది. ప్రియుడు ప్రణయ్ వల్లే మన జీవితం ఇలా చెడిపోతుందని భర్త అంటుంటే.. భర్తనే ఆమె బెదిరించినట్లుగా ఆడియోలో ఉంది. ఈ ఆడియో టేపుల ఆధారంగా పావనిని అరెస్టు చేశారు. పావని వేధింపుల వల్లే ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.