హ్యాట్సాఫ్: హైదరాబాద్ తొలి మెట్రో రైలును నడిపింది.. మన తెలంగాణ అమ్మాయే!
భాగ్యనగర ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరి తొలి ‘మెట్రో రైలు’ను నడిపిందెవరో తెలుసా? మన తెలంగాణ అమ్మాయిలు.
Recommended Video
హైదరాబాద్: నగరంలో మొదలైన మొదటి 'మెట్రో రైలు'ను నడిపిందెవరో తెలుసా? వారు మహిళా డ్రైవర్లు.. అందునా తెలంగాణ అమ్మాయిలు. భాగ్యనగర ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రారంభం అనంతరం ప్రధాని మోడీ కూడా ఈ మెట్రోరైలు ఎక్కి మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకూ ప్రయాణించారు. తిరిగి అదే రైలులో ఆయన మియాపూర్కు చేరుకున్నారు. ప్రధాని ప్రయాణించిన ఈ మొట్టమొదటి మెట్రో రైలును నిజామాబాద్ జిల్లాకు చెందిన సుప్రియా సనమ్ నడిపారు.
ఈ సందర్భంగా లోకో పైలట్ సుప్రియ మాట్లాడుతూ... సవాళ్ళతో కూడిన విధులను నిర్వహించేందుకు తానెంతో ఇష్టపడతానని తెలిపారు. హైదరాబాద్లో ప్రధాని ప్రయాణించిన తొలి మెట్రో రైలును నడిపే సమయంలో తాను ఎంతో ఉద్వేగానికి గురైనట్లు ఆమె పేర్కొన్నారు.
సుప్రియతో పాటు మరో ముగ్గురు మహిళా డ్రైవర్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్లో ఉన్నారు. వీరిలో వరంగల్కు చెందిన కె.సింధుజ, మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్ మండలం బలిజపేటకు చెందిన బి.వెన్నెల, హైదరాబాద్కు చెందిన జి.ప్రణయ ఉన్నారు.
Women are going to be a major driving force behind the world’s largest public private partnership project - #HyderabadMetro
— KTR (@KTRTRS) November 25, 2017
35 women loco pilots will be steering Hyderabad Metro trains. @hmrgov @ltmhyd pic.twitter.com/9nc0nAIyrg