గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపులతో మహిళ ఆత్మహత్య, నింద భరించలేక విద్యార్థి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. కెపిహెచ్‌బి ఎస్సై జానయ్య, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా కొత్తపాలానికి చెందిన శ్రీనివాస రావు, శకుంతల కుమార్తె సుకన్య.

సుకన్యకు అదే జిల్లాకు చెందిన మహేష్‌తో పద్నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. గుంటూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో మహేష్ ఉద్యోగం చేస్తున్నాడు. సుకన్య తల్లిదండ్రులు పెళ్లి సమయంలో రూ.5 లక్షల కట్నం ఇచ్చారు.

వివాహిత మృతి

వివాహిత మృతి

కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.

 వివాహిత మృతి

వివాహిత మృతి

అదనపు కట్నం కోసం భర్త వేధింపులు చేయడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని సుకన్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివాహిత మృతి

వివాహిత మృతి

అయితే, తాను ఎప్పుడూ అదనపు కట్నం కోసం వేధించలేదని, సుకన్య భర్త చెబుతున్నారు. తామిద్దరం సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

విద్యార్థి ఆత్మహత్య

విద్యార్థి ఆత్మహత్య

కాచిగూడ వైశ్య హాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీష్ మూడో అంతస్తు నుంచి దూకాడు.

భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మూడు నెలల క్రితం సుకన్య ప్రస్తుతం నిజాంపేట రోడ్డులో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం బెడ్ రూంలోకి వెళ్లిన సుకన్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందింది.

మరోవైపు, కాచిగూడ వైశ్య హాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీష్ మూడో అంతస్తు నుంచి దూకాడు. సెల్ ఫోన్ దొంగిలించాడనే నింద భరించలేక అతను ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

English summary
woman suicide in KPHB, Student in kachiguda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X