రాజకీయాల్లోకి రమ్మని భర్త ఒత్తిడి!: మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెదింది. హైదరాబాదులోని నల్లగుట్ట ప్రాంతంలో ఉంటే శ్వేత ఆదివారం ఉదయం లేచి చూసేసరికి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఉంది.
ఆమె ఆత్మహత్య చేసుకుందని, అత్తింటి వారు చెబుతుండగా, భర్తనే ఉరి వేసి చంపి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగుట్టకు చెందిన శ్రీకాంత్కు శ్వేతతో వివాహం అయింది. ఆమె సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. గత రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగిందని అంటున్నారు. ఈ కారణంగానే ఆమె మృతి చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు.
భర్త శ్రీకాంత్ రోజు మద్యం తాగి వచ్చేవాడని, నిన్న వారి మధ్య గొడవ జరిగిందని అంటున్నారు. సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న శ్వేతను.. తన ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రమ్మని అతను వేధించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో ఓ రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో కార్పోరేట్ సీటు కోసం ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.
అనుమానాలు
శ్వేత అయిదున్నర అంగుళాలు ఉంటుందని, అలాంటప్పుడు ఆమె ఆత్మహత్య ఎలా చేసుకోగలుగుతుందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. భర్తనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి రమ్మన్నారని, కానీ అందుకు ఆమె సుముఖంగా లేదని తెలుస్తోంది.