స్కూటిపైకి దూసుకెళ్లిన టిప్పర్: మహిళా టెక్కీ మృతి, ఆమె భర్తకు తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన ప్రవీణ్, రమ్య దంపతులు క్యాప్ జెమినీ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. శనివారం ఉదయం ఇద్దరూ స్కూటీపై చిలుకూరి బాలాజీ దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
ఆ సమయంలో ప్రవీణ్ స్కూటీ నడుపుతున్నాడు. స్కూటీ విప్రో చౌరస్తా వద్దకు రాగానే పక్కనే రోడ్డుపై వస్తున్న టిప్పర్ లారీనీ ఓవర్ టేక్ చేసే ప్రయత్న చేశాడు ప్రవీణ్. అదే సమయంలో టిప్పర్ పక్కకు మళ్లి స్కూటీపైకి దూసుకు వెళ్లింది.
దీంతో స్యూటీ వెనకాల కూర్చున్న రమ్యపైకి లారీ టైరు ఎక్కటంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు కాంటినెంటల్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు.