యాదాద్రి బ్రహ్మోత్సవాలు ... మత్స్యావతారంలో ఊరేగిన స్వామి .. నేడు కృష్ణావతారం
బ్రహ్మోత్సవాలతో శోభాయమానంగా వుంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన దివ్య క్షేత్రం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. మార్చి 08వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మొత్తం 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాలు .... స్వస్తి వాచనంతో , మంగళ వాయిద్యాలతో ఘనంగా ప్రారంభం
మత్స్యావతారంలో దర్శనం ఇచ్చిన స్వామివారు
తొలిరోజు లక్ష్మీ నరసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు స్వస్తివాచనం తో చుట్టారు వేదపండితులు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామివారు ఉదయం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాల మధ్య శేషవాహనంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్య అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు, నేడు శ్రీకృష్ణావతారంలో శేష వాహనంపై పురవీధుల్లో ఊరేగనున్నారు.
నేడు శ్రీ కృష్ణావతారంలో పురవీధులలో స్వామి విహారం
నేడు కృష్ణావతారంలో అలంకృతులైన స్వామివారు హంస వాహనంపై పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి ఇప్పటికే భక్త జనం పోటెత్తుతున్నారు. ఈ నెల 18 వరకు వేడుకగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవ సంబరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈనెల 18 వరకు వేడుక .. కళ్యాణోత్సవానికి హాజరుకానున్న గవర్నర్
ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించి ఉత్సవ ప్రాధాన్యతను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం వేళల్లో అలంకారసేవలు, రాత్రి వేళల్లో శ్రీవారి వాహనసేవలు ప్రతీ రోజు జరగనున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్ విశిష్ట అతిధిగా 15న ఉదయం కళ్యాణోత్సవానికి హాజరుకానున్నట్లు తెలిపారు.