తెలంగాణలో వైసీపి పోటీ..! వైయస్ అభిమానులు ఉన్నారంటున్న నాయకులు..!!
గత ఎన్నికల్లో ప్రభావం చూపిన వైసీపి..! షర్మిల ప్రచారం చేస్తే ఫలితం మరోలా ఉంటుందంటున్న నేతలు..!!గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కాకపోయినా, కొన్నింటిలోనైనా పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిని అభిమానించే వారు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. అయితే, వైసీపీలోని కొందరు నేతలు మాత్రం తెలంగాణలో పోటీ చేసే అంశం పట్ల ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
జగన్ సోదరి షర్మిలతో తెలంగాణలో అభ్యర్థుల తరుపున ప్రచారం చేయించాలని తెలంగాణ వైసీపి అద్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశం పై కొద్ది రోజులముందు పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశాలు కూడా నిర్వహించారు. తెలంగాణలో పోటీ చేయాలా..? చేస్తే ఎన్ని సీట్లలో చేయాలి అనే అంశాల పట్ల పార్టీ అదినేత జగన్ మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాల్సి ఉన్నట్టు లోటస్ పాండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.