టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు 1.11 కోట్ల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్ కు చెందిన యగమేటి రామిరెడ్డి అనే భక్తుడు ఈ విరాళాన్ని అందించారు.
కియా కారుపై రోజా తొలి ఆటోగ్రాఫ్: రోడ్డెక్కిన సెల్టోస్: ఆవిష్కరించిన మంత్రులు
ఈ మేరకు విరాళం మొత్తంతో కూడిన చెక్కును ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సమక్షంలో గురువారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉదయం రామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలను సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఆవరణలో ఉన్న రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ ను కలిసి చెక్కును అందజేశారు.
Comments
English summary
A devotee from Hyderabad Yugameti Rami Reddy has donated Rs.1.11 crore to the Srivari Anna Prasadam Trust. He presented the DD for the donation to the TTD chairman YV Subba Reddy at the Ranganayakula mantapam inside the Srivari temple.
Story first published: Thursday, August 8, 2019, 18:52 [IST]