తిరుమల హోటళ్లపై కొరడా...రూ 30కే ఫుల్ మీల్స్
తిరుమలో ప్రవైట్ హోటల్ వ్యాపారుల దోపిడికి అడ్డుకట్టవేసింది. ప్రపంచ వ్యాప్తంగా తిరుమలను అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి తిరుమలకు చేరుకుంటున్న భక్తులకు దేవాదాయ శాఖ అనేక సౌకర్యాలను కల్పిస్తుంటే, అక్కడ తిష్ట వేసిన ప్రైవేట్ వ్యాపారులు మాత్రం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల పైన దేవాదయ శాఖ దృష్టి సారించింది.
ప్రైవేటు హోటళ్లకు కళ్లేం వేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే ఇప్పటివరకు వసూలు చేస్తున్న ఆహార పదార్థాల రేట్లను తగ్గించారు. ఈ నేపథ్యంలోనే విజిటెబుల్ బిర్యానికి రూ.19, ప్లేట్ మీల్స్కు 22.50, కాగా ఫుల్ మీల్స్ కోసం రూ.31 ఇండ్లీకి రూ.7.50, ఉప్మాకు రూ.9 కాగా చపాతికి కేవలం రూ. 20లను మాత్రమే చెల్లించాలని చెప్పారు. కాగా ఇప్పటి వరకు ఫుల్ మీల్స్ కోసం 100 రుపాయాలను వసూలు చేస్తుండగా ప్లేట్ ఇండ్లీ కోసం 25 రుపాయాలను వసూలు చేస్తున్నారు.
కాగా ఎవరైన పైన పేర్కోన్న ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించినట్టయితే పిర్యాధు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ను కూడ ప్రకటించారు. మొత్తంమీద దేవస్థానం తీసుకున్న చర్యలతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశాలు ఉన్నాయి.