అత్యాచార పాపం... పదమూడేళ్ల అమ్మాయి, అమ్మయింది...!!
పదమూడేళ్ల బాలిక అప్పుడే అమ్మయింది. తాను ఆడుకోవాల్సిన వయస్సులో ఇంకోకరి అలనాపాలన చూడాల్సిన భాద్యతలోకి నెట్టివేయబడింది. సమాజం నేర్పిన వింత పోకడలకు తన జీవితాన్ని బలిచెసుకుంది. తనకు ఏం జరుగుతుందో తెలిసేలోపే ఓ బిడ్డకు తల్లిగా మారింది.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఐనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక మానవ సంబంధాల విలువలు తెలియని మానవ మృగం మాటలకు లొంగిపోయింది. శారీరకంగా వచ్చే మార్పులకు సరైన మార్గాలను చూపించాల్సిన వ్యక్తి బాలిక బంగారు భవిష్యత్కు పుల్స్టాప్ పెట్టి ఆమేపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వరుసకు సోదరుడైన దుండగుడు ఆమేను గర్భవతిని చేశాడు. అయితే గర్భం దాల్చిన విషయం కూడ తెలియని అమాయక మైనర్ బాలిక తాను తల్లిగా మారుతున్న పరిస్థితులను కూడ సకాలంలో తెలుసుకోలేక పోయింది. దీంతో గర్భం దాల్చిన ఆరు నెలలకు బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో అబార్షన్ చేసి బాలికను రక్షించే అవకాశం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలోనే ఆమేను స్త్రి శిశుసంక్షేమ సంస్థ సంరక్షణలో ఉంచారు. ఇక మూడు నెలలుగా వారి సంరక్షణలోనే ఆమే తొమ్మిది నెలల గర్భానికి పురుడు పోసుకుంది. గురువారం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ ద్వార ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిపై గతంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.