గన్నవరం ఎయిర్ పోర్టు: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ప్లైట్లో 63 మంది...
గన్నవరం ఎయిర్పోర్టులో కాసేపటి క్రితం ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా ఎయిరిండియా విమానం అదుపు తప్పింది. రన్వే పక్కన గల స్తంభాన్ని విమానం రెక్క ఢీకొట్టింది. పైలట్ కన్ఫ్యూజన్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. విమానం ఉన్న 63 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

విమానం దోహా దేశం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానం రెక్క స్తంభాన్ని ఢీకొట్టడంతో అరుపులు, కేకలు వేశారు. ప్రమాదం తప్పడంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనతో పలు విమాన రాకపోకలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎయిర్పోర్టు అధికారులు వెంటనే మరమ్మతు పనులను చేపట్టారు.