విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ నిర్ణయంపై భగ్గుమన్న అమరావతి- పలుచోట్ల రైతుల ఆందోళనలు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంపై అమరావతి భగ్గుమంది. గవర్నర్ ప్రకటన రాగానే రాజధాని గ్రామాల్లో రైతులు రోడ్డెక్కారు. సీఎం జగన్ తో పాటు గవర్నర్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. రాజధాని తరలింపును అడ్డుకుని తీరుతామని నినాదాలు చేస్తున్నారు.

బాబాయ్ కి జగన్ మరో ఝలక్- మోపిదేవికి రాజధాని బాధ్యతలు - వైసీపీలో మరో పవర్ గేమ్ ? బాబాయ్ కి జగన్ మరో ఝలక్- మోపిదేవికి రాజధాని బాధ్యతలు - వైసీపీలో మరో పవర్ గేమ్ ?

రాజధాని గ్రామాలైన మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెంతో పాటు పలుచోట్ల రైతులు నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాజధాని తరలింపుకు సిద్దమవుతోందని, దానికి గవర్నర్ ఆమోదం తెలపడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కారణంగా కొన్నిరోజులుగా రోడ్లపై ఆందోళనలు లేకుండా ఇళ్ల వద్దే ఉంటున్న రైతులు... గవర్నర్ తాజా నిర్ణయంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. సచివాలయానికి వెళ్లే దారిలో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్లపైనే నిరసనలు తెలుపుతున్నారు.

anti govternment protests in amaravati after ap governor approves three capital bills

Recommended Video

Breaking: AP's 3 Capitals Bill Approved By Governor న్యాయస్ధానాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై ఉత్కంఠ ?

రైతుల ఆందోళన నేపథ్యంలో సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే విజయవాడలోని గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ వద్ద కూడా భద్రత పెంచారు. రాజ్ భవన్ కు వచ్చే అన్ని దారుల్నీ మూసేశారు.

English summary
amaravati farmers hold protests in villages after governor's approval to three capital bills today. farmers opposing governor's decision and stages protests against the govt also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X