టార్గెట్ చంద్రబాబు..సభలో స్క్రీన్ ప్రజెంటేషన్: జగన్..ఎమ్మెల్యేల పంచ్లు: బుల్లెట్ దిగిందా..
ఏపీ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా ముఖ్యమంత్రి..వైసీపీ నేతలు ముప్పేట దాడి చేసారు. సీఎం జగన్ గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలను ఎండగడుతూ దీనికి ఆధారంగా అధికారులు రాసిన లేఖలు..నాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా సభలోనే ప్రదర్శించారు. ఇక..సీనియర్ మంత్రులు.. ఎమ్మెల్యేలు పంచ్లతో టీడీపీ మీద రాజకీయ దాడి చేసారు. అచ్చెన్నాయుడును సీఎం జగన్ వదల్లేదు. శరీరం పెరిగింది కానీ..బుర్ర పెరగలేదంటూ కామెంట్ చేసారు. ఇక..అంబటి..అనిల్..పెద్దిరెడ్డి నేరుగా చంద్రబాబును ఉద్దేశించి వేసిన పంచ్లతో సభలో కొత్త వాతావరణం కనిపించింది.
Recommended Video
సభలోనే స్క్రీన్ ప్రజెంటేషన్..
ముఖ్యమంత్రి జగన్ కరువు మీద ప్రకటన చేసే సమయంలో ఈ పరిస్థితికి చంద్రబాబు కారణమంటూ ఆధారాలను సభ లో ప్రదర్శించారు. అధికారులు విత్తనాల కోసం చెల్లించాల్సిన సొమ్మును విడుదల చేయాలంటూ నాటి ముఖ్యమంత్రి కి రాసిన లేఖలను స్క్రీన్ పైన సభలో జగన్ ప్రదర్శించారు. దీంతో..టీడీపీ నేతలు ఇరుక్కుపోయారు. అదే విధంగా రైతు రుణ మాఫీ విషయంలో ఎన్నికల సమయంలో ఏం చెప్పారు..ముఖ్యమంత్రిగా ఏం చెప్పారనే భిన్న వ్యాఖ్యలను సైతం సభలోనే ప్రదర్శించారు. తన ప్రసంగానికి మద్యలో అడ్డు తగిలిన అచ్చెన్నాయుడు మీద పంచ్ వేసారు. శరీరం పెరిగింది కానీ..ఇంత కూడా బుర్ర పెరగలేదంటూ వ్యాఖ్యానించారు. ఇక.. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సైతం వయసు తో పాటుగా హుందాతనం పెరగాలని జగన్ సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సున్నా వడ్డీ మీద మాట్లాడే విషయంలో నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నిలదీసారు.
డైలాగ్ వార్: జగన్ వర్సెస్ చంద్రబాబు: కాళేశ్వరం పైన క్లారిటీ: అనుభవం అంత లేదు మీ వయసు..!
ఇక..మంత్రులు సైతం అదే బాటలో..
కాళేశ్వరం ప్రాజెక్టు.. కరువు మీద చర్చ సమయంలో మంత్రి అనిల్ సినిమా డైలాగ్లతో చెలరేగారు. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు అని చేసిన కామెంట్ మీద అనిల్ స్పందించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు..ఎప్పుడు వచ్చారు కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేదే విషయం అని వ్యాఖ్యానించారు. ఇక, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం మాట్లాడారు. సీఎం జగన్ కరువు నివారణ కోసం ప్రతీ ఎమ్మెల్యేకు కోటి రూపాయాలు ఇస్తున్నామని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం ఇస్తామని ప్రకటించారు. దీంతో..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలం అందరం కలిసి నియోజకవర్గ నిధుల కోసం వెళ్తే ఇవ్వమని చెప్పారని..ఇప్పుడు జగన్ ను చూసి అయినా టీడీపీ నేతలు అభినందించాలని సూచించారు. ఆ సమయంలోనూ సభలో హాట్ చర్చ సాగింది.
ఇద్దరు నాయుడులు కలిసి చంద్రబాబును ముంచుతారు..
సభలో సున్నా వడ్డీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చారా లేదా అనే విషయం పైన ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీని నిలదీసారు. ఆ సమయంలో చంద్రబాబు తన హయాంలో జీరో వడ్డీ చెల్లించారా లేదా చెప్పాలని ముఖ్యమంత్రి ..ఆర్దిక మంత్రి డిమాండ్ చేసారు. ఆ సమయంలో సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. జోక్యం చేసుకున్న అంబటి రాంబాబు వ్యంగంగా చంద్రబాబు పైన విమర్శలు చేసారు. తన హాయంలో జీరో వడ్డీ చెల్లించలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుసని.. అయితే, పక్కనే ఉన్న అచ్చంనాయుడు..పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు తెలిసీ తెలియని సమాచారంతో చంద్రబాబును సభలో ముంచుతారని వ్యాఖ్యానించారు. వైసీసీ ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ ఇలా అధికార పార్టీ చేస్తే..చంద్రబాబు రక్తం మరిగిపోదా అండీ అంటూ చేసిన కామెంట్తో సభలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది.