Nimmagadda కు ఏపీ హైకోర్టు షాక్- ఈ వాచ్ యాప్ వాడొద్దని ఆదేశాలు- కారణమిదే
ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా వైసీపీ సర్కారుకూ, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంతో తెరపైకి వచ్చిన ఈ-వాచ్ యాప్కు భంగపాటు తప్పలేదు. ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా ఈ యాప్ను తీసుకొచ్చిన నిమ్మగడ్డకు హైకోర్టులో నిరాశ తప్పలేదు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలను గుర్తించేందుకు, ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ యాప్ను ప్రారంభించారు. అయితే ప్రభుత్వం వివిధ కారణాలతో దీన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం ఇప్పటికే నిఘా కోసం రెండు యాప్లు పనిచేస్తున్నాయని, ఈ కొత్త యాప్ అవసరం లేదని వాదించింది. అయినా ఎస్ఈసీ వినలేదు. దీంతో ప్రభుత్వం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు ఈ వాచ్ యాప్కు అనుమతి నిరాకరించింది.
ఎస్ఈసీ
తీసుకొచ్చిన
ఈ
వాచ్
యాప్కు
భద్రతా
అనుమతులు
తీసుకోకపోవడంతో,
వాటి
కోసం
దరఖాస్తు
చేసినా
ఆలస్యం
అవుతుండటం
వంటి
కారణాలతో
యాప్కు
చుక్కెదురైంది.
ఈ
యాప్ను
గుర్తించేందుకు
హైకోర్టు
నిరాకరించింది.
దీంతో
ఇప్పటికే
ప్రభుత్వ
ఆధ్వర్యంలో
పనిచేస్తున్న
నిఘా
యాప్తో
పాటు
సీ-క్యాప్
యాప్ను
వాడుకుంటామని
ఎస్ఈసీ
తరఫు
న్యాయవాది
హైకోర్టుకు
తెలిపారు.
దీంతో
హైకోర్టు
ఈ
యాప్పై
తదుపరి
విచారణను
ఈ
నెల
17కు
వాయిదా
వేసింది.