చంద్రబాబుకు మతి భ్రమించింది...? మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్
పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల మంటలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 80 శాతం స్థానాలను గెలుచుకుందని మంత్రి తెలిపారు. కుప్పం ఓటమితో చంద్రబాబుకు మతి తప్పి, గతి తప్పి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.
విజయవాడలో ఉన్న టీడీపీ నాయకుల్లో గ్రూపు తగాదాలను మంత్రి ప్రస్తావించారు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి దోచుకున్నారని కేశినేని నాని గురించి ప్రస్తావించారు. మళ్లీ తగుదునమ్మా అని మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని ఫైరయ్యారు. కేశినేని నాని కూతురు మేయర్ అని అంటారు.. కాదని టీడీపీ నేతలు అంటారు. అన్ని డ్రామాలేనని చెప్పారు. కేశినేని శ్వేత ఓటమి అంచున ఉంది.. కచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
అందుకోసమే నాని విత్ డ్రా చేసుకుంటాను అని అంటున్నారని చెప్పారు.. విజయవాడ 64 డివిజన్లు కైవసం చేసుకుంటామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఆలయాల దాడులపై ప్రభుత్వం మద్దతు ఉందని జీవీఎల్, సోము వీర్రాజు మాట్లాడటం సరికాదన్నారు. టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు.