విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ నేతల ఆగడాలు సీఎం జగన్‌కు కనిపించవా..? ఎంపీడీవోపై దాడిని ఖండించిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో పై ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి దాడి చేశారని వస్తున్న ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. విధి నిర్వాహణలో ఉన్న మహిళ అధికారిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. దాడి చేయడంపై న్యాయం చేయాలని అర్థరాత్రి సమయంలో పోలీసులను ఆశ్రయిస్తే... కేసు నమోదు చేసేందుకు పోలీసులు భయపడడం అంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వరా: ఆ మతానికి చెంది..అతీతుడా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వరా: ఆ మతానికి చెంది..అతీతుడా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళలని కూడ చూడకుండా వారిపై దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎంపీడివో ఇంటికి కరెంట్‌తో పాటు నీటీ కనెక్షన్‌ను కట్ చేసి చెత్తకుండి పెట్టి వేధింపులకు గురి చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. ఇక వైసీపి నేతలు చేస్తున్న అగడాలు ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించవా అంటూ ధ్వజమెత్తారు.

 chandrababu naidu condemned attacked on the venkatachalam mandal mpdo.

నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం రాత్రీ అనుచరులతో కలిసి ఇంటిపై దాడి చేశారని ఎంపీడివో సరళ అరోపించారు. దీంతో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు ఆమే అర్థరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అయితే కేసును తీసుకునేందుకు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆమే వెనుదిరిగారు. కాగా ఇదంతా మీడియాలో రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో దిగివచ్చిన పోలీసులు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
TDP president N chandrababu naidu condemned attacked on the venkatachalam mandal mpdo.and criticised ycp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X