విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ రెండు రోజులు తిరిగి పది రోజులు ఇంట్లో పడుకుంటే నాయకుడవుతారా అన్న మోత్కుపల్లి

|
Google Oneindia TeluguNews

పవన్ కళ్యాణ్ పై సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీపై ప్రజలలో విశ్వాసం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ పార్టీపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ప్రజలు గుర్తించటం లేదని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు టార్గెట్ గా కేంద్రం అడుగులు .. పోలవరంపై పెంటపాటికి లేఖ చంద్రబాబు టార్గెట్ గా కేంద్రం అడుగులు .. పోలవరంపై పెంటపాటికి లేఖ

రాజకీయాల్లో చిరంజీవి వైఫల్యం జనసేన మీద పడిందన్న మోత్కుపల్లి

రాజకీయాల్లో చిరంజీవి వైఫల్యం జనసేన మీద పడిందన్న మోత్కుపల్లి

ఏపీలో జనసేన ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ ప్రజల్లో నాయకుడిగా గుర్తింపు లేకపోవటమే అని మోత్కుపల్లి పేర్కొన్నారు. సినీరంగంలో హీరోలుగా చేసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. ప్రజా రాజ్యం పార్టీ పెట్టి తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి చిరంజీవి ఫెయిల్ అయ్యారని దాని ప్రభావం జనసేన మీద పడటంవల్ల పవన్ కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో చిరంజీవి వైఫల్యం ఇటీవల ముగిసిన ఎన్నికలలో జనసేన గెలిచే అవకాశాలను ప్రభావితం చేసిందని సీనియర్ రాజకీయవేత్త మోట్కుపల్లి నరసింహులు అభిప్రాయపడ్డారు .

 రెండు రోజులు తిరిగి పది రోజులు పడుకుంటే ప్రజల్లో విశ్వాసం కష్టం అన్న మోత్కుపల్లి

రెండు రోజులు తిరిగి పది రోజులు పడుకుంటే ప్రజల్లో విశ్వాసం కష్టం అన్న మోత్కుపల్లి

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో అనేక అంశాలపై పోరాటం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కేవలం పోరాటం సమయంలోనే ఆయన బయటకు వస్తారని రెండు రోజులు తిరిగి పది రోజులు ఇంట్లో పడుకుంటే నాయకులు ఎలా అవుతారని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు. అలా కాకుండా నిరంతరాయంగా ప్రజల్లో ఉంటె, నిత్యం ప్రజా క్షేత్రంలో పని చేస్తుంటే అప్పుడు ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారు. ఏదైనా నిరసన ప్రణాళిక చేసినప్పుడు మాత్రమే బయటకు వస్తే ప్రజలు ఎలా గుర్తిస్తారని మోత్కుపల్లి విమర్శించారు.

డబ్బు, మద్యం పంచకుండా ఎవరూ ఉండరని జనసేనాని పై కౌంటర్

డబ్బు, మద్యం పంచకుండా ఎవరూ ఉండరని జనసేనాని పై కౌంటర్

ఇక జనసేన మద్యానికి, డబ్బుకు ప్రలోభపెట్టకుండా తాము ఓట్లు సంపాదించామని చెప్పిన పవన్ వ్యాఖ్యలపై మోత్కుపల్లి అందరూ అలాగే చెప్తారు కానీ అందరూ ప్రలోభాలకు గురి చేస్తూనే ఉంటారని ఆ మాటలు అంత పట్టించుకోతగ్గవి కాదని ఆయన తేల్చి పారేశారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు పై ఎన్నికల సంఘం నిఘా వున్నా విచ్చలవిడిగా డబ్బు, మద్యం ఓటర్లకు అందుతుంది అని మోత్కుపల్లి తెలిపారు. పవన్ ఇప్పటికైనా ప్రయత్నం చేస్తే నిత్యం ప్రజల్లో ఉంటె వచ్చే ఎన్నికల్లో అయినా కాస్త పుంజుకునే అవకాశం ఉందని మోత్కుపల్లి పేర్కొన్నారు.

English summary
Senior politician Motkupalli Narasimhulu said that failure of Chiranjeevi in politics has affected winning chances of Jana Sena in recently concluded elections. He opined that Jana Sena chief Pawan Kalyan would have been with people continuously in the last five years by fighting on several issues. Motkupalli stated that people don't believe in a leader, who only comes out only when a protest is planned. To a question, he mentioned that people will vote for leaders of their choice despite taking money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X