ఎన్నికల కమిషనర్ ను వదిలేది లేదు: చంద్రబాబు కోసమే వాయిదా..ఆ వర్గమే: సీఎం జగన్ మండిపాటు..!
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పైన ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. చంద్రబాబు కోసమే ఎన్నికల కమిషనర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటూ సీఎం ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయిన వ్యవస్థను దిగజార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన సామాజిక వర్గానికి చెందిన రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారికగా నియమించారని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. ఆయన ఈ రోజు ఎన్నికలు వాయిదా వేస్తూ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు.
ఎస్ఈసీ విచక్షణ కోల్పోయారని ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ కు ఉండాల్సిన ప్రాధమిక లక్షణం నిష్పాక్షికత అంటూ మండిపడ్డారు. అసలు..ఆయన ప్రభుత్వంలోని అధికారులో కరోనా పైన చర్చలు చేయకుండానే..కరోనా కారణం చూపుతూ ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ఆయన పైన గవర్నర్ కు ఫిర్యాదు చేసానని..చర్యలు తీసుకోకుంటే.. మరింత ముందుకు వెళ్తామని హెచ్చరించారు.
చంద్రబాబు ఓడిపోతారనే ఆయన బాధ..
ఎన్నికల కమిషనర్ తనను నియమించిన చంద్రబాబు ఓడిపోతారనే బాధతోనే ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేశారని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించిన సమయంలో రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్పీలను..అధికారుల పైన చర్యలు తీసుకోవటం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఆ అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అటువంటి చర్యలు తీసుకుంటే తప్పు బట్టే అవకాశం ఉండదని సీఎం చెప్పుకొచ్చారు. శనివారం సాయంత్రం కలెక్టర్లకు ఎన్నికల సంఘం నుండి లేఖలు వచ్చాయని..అందులో పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ నిలుపుదల చేయాలని సూచించారని..తెల్లవారే సరికి ఏం జరిగిందని ఎన్నికలు వాయిదా వేసారని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబు ఓడిపోతున్నారు..వైసీపీ ఏకపక్షంగా గెలుస్తుందనే కారణంతోనే తట్టుకోలేక రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.
కనీసం కార్యదర్శికి సైతం తెలియకుండానే...
కరోనా
కారణంగా
ఎన్నికలు
వాయిదా
వేస్తున్నామని
చెప్పిన
రాష్ట్ర
ఎన్నికల
ప్రధానాధికారి
కనీసం
రాష్ట్రంలో
కరోనా
పరిస్థితుల
పైన
ఏ
అధికారితోనూ
సమీక్షించలేదని
చెప్పుకొచ్చారు.
పేదలకు
మంచి
జరగటం
ఇష్టం
లేకనే
ఇళ్ల
స్థలాల
పంపిణీ
వాయిదా
వేశారని
మండిపడ్డారు.
ప్రతీ
ఒక్కరూ
ఈ
మధ్య
కాలంలో
తమ
విచక్షణాధికారం
అంటూ
కొత్త
పదం
నేర్చుకొని
ఇష్టారాజ్యంగా
చేస్తున్నారని
విమర్శించారు.
ఎన్నికల
కమిషనర్
తీసుకుంటున్న
నిర్ణయం
గురించి
కనీసం
కార్యదర్శికి
కూడా
తెలియదని..ఎక్కడి
నుండో
తయారై
ఆదేశాలు
వస్తుంటే..ఆయన
అమలు
చేస్తున్నారంటూ
పరోక్షంగా
చంద్రబాబు
గురించి
ప్రస్తావించారు.
రాష్ట్రంలో
151
సీట్లు
గెలిచిన
వైసీపీలో
ముఖ్యమంత్రి
అయిన
తనదా
అధికారం..ఎన్నికల
కమిషనర్
దా
అని
జగన్
ప్రశ్నించారు.
ఇక,
అధికారులకు
మెమోలు
ఇవ్వటం..చర్యలు
తీసుకోవటం
ఏ
రకంగా
చేస్తారని
జగన్
నిలదీశారు.
ఇక,
రాష్ట్రంలో
గతంలో
జరిగిన
స్థానిక
సంస్థల
ఎన్నికల
సందర్భం
లో
చోటు
చేసుకున్న
ఘటనల
కంటే
ఇప్పుడు
చాలా
తక్కువగా
జరిగాయని
వివరించారు.
రమేష్ కుమార్ ను వదిలే ప్రసక్తే లేదు..
రమేష్ కుమర్ పైన గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశామని...ఆయన ఎన్నికల కమిషనర్ ను పిలిపించి మాట్లాడుతామని చెప్పారని జగన్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆయన పైన తీసుకొనే చర్యల ఆధారంగా తాము మరింత ముందుకు పోతామని వివరించారు. ఎన్నికలు ఆగిపోతే రాష్టంకు రావాల్సిన దాదాపు అయిదు వేల కోట్ల రూపాయాల నిధులు నిలిచిపోతాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ల సమయంలో 43 చోట్ల చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకున్నాయని..తమ పోలీసులు కొందరి పైన 307 సెక్షన్ కింద కేసులు కూడా నమోదు చేసారని వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఏకగ్రీవాలు జరిగాయని గుర్తు చేశారు. తమ పార్టీ అభ్యర్ధులు ఏకగ్రీవం అవుతుంటే చంద్రబాబు తో పాటుగా రమేష్ కుమార్ తట్టుకోలేకపోతున్నారని సీఎం మండిపడ్డారు.