ఏపీ సచివాలయాన్ని వదలని కరోనా ... కొత్తగా మరో 8 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మంత్రులు , ఎమ్మెల్యేలు , ఉద్యోగులు , సామాన్యులు ఒక్కరేమిటీ రాష్ట్ర వ్యాప్తంగా , మారు మూల గ్రామాల నుండి కూడా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ఏపీలో కరోనా ముఖ్యంగా ఉద్యోగులకు దడ పుట్టిస్తుంది .కరోనా వైరస్ ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని మాత్రం వదలటం లేదు .ఇప్పటికే పలువురు సచివాలయ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు .
ఏపీలో కరోనా కేసులు పెరగటానికి టెస్టులే కారణం ... ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నానీ
తాజాగా మరోమారు ఏపీ సెక్రటేరియట్ లో కరోనా కలకలం రేపింది . గురువారం ఒక్క రోజే ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ లో 8 పాజిటివ్ కేసులు నమోదైనట్లు గా అధికారులు నిర్ధారించారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన అధికారులతో కాంటాక్ట్ అయిన వారు టెస్టులు చేయించుకోవాలని, వారంతా క్వారంటైన్ లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే ఇప్పటివరకు 1,86,461 కేసులు నమోదు కాగా వాటిలో 80,426 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 1,04,354 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,681 మంది కరోనాతో మృతి చెందారు.