బసవ తారకం స్వగ్రామం : భువనేశ్వరి దత్తత : నారా దేవాన్ష్ కాలనీ..!
ఎన్టీఆర్ సతీమణి స్వగ్రామం అది. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి..ఎన్టీఆర్ కుమార్తు ఆ గ్రామాన్ని దత్తత తీసుకు న్నారు. ఆ గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలకు చొరవ చూపించారు. ఆ గ్రామంలో పేదల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం లో భాగంగా కాలనీ ఏర్పాటైంది. ఆ కాలనీకి ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్ కాలనీగా పేరు పెట్టారు.
కొమరవోలు..భువనేశ్వరి దత్తత
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 2015 సెప్టెంబరులో దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ జనాభా సుమారు 2,200 గా ఉంది. ఎన్టీఆర్ భార్య బసవరామతారకం ఈ గ్రామంలోనే జన్మించటం తో తల్లి మీద ప్రేమ తో ఈ గ్రామాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించారు.
భువనేశ్వరి
పలు దఫాలు గా గ్రామాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ఆ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధుల తోపాటు గ్రామస్తులు వితరణ ఇచ్చిన డబ్బును కలుపుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. భువనేశ్వరి చొరవ తో ఆ గ్రామంలో అభివృద్ది పనులు పరుగులు పెట్టాయి. ఇప్పుడు ఆ గ్రామస్తులు సైతం భువనేశ్వరిని అభినందిస్తున్నారు. ఆమె చొరవ తోనే అభివృద్ది సాధ్యమైందని చెబుతున్నారు.
హౌసింగ్ కాలనీకి దేవాన్ష్ పేరు..
కొమరవోలు లో అభివృద్ది కి దృష్టి పెట్టని భువనేశ్వరి..ముఖ్యమంత్రి చంద్రబాబు తో కలిసి ఆ గ్రామంలో పర్యటించా రు. గ్రామస్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న బంధువులు సైతం అక్కడికి చేరుకున్నారు. అయితే, ఇదే గ్రామంలో పేదల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం లో భాగంగా కాలనీ ఏర్పాటైంది. ఆ కాలనీకి ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్ కాలనీగా పేరు పెట్టారు.