హైదరాబాద్ జనసేన కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు- పవన్ కళ్యాణ్ పతాకావిష్కరణ
74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు పవన్ నివాళులు అర్పించారు.
Recommended Video
హైదరాబాద్ జనసేన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, పార్టీ నేతలు షేక్ రియాజ్, వై.నగేష్, పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. కరోనా కారణంగా ఏపీకి దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో వేడుకలకు మొగ్గు చూపారు. కరోనా వ్యాప్తి సమస్య ఉన్నందున అతి కొద్ది మంది నేతలను మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.