విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలకలం... ఒకేచోట ముగ్గురి మృతదేహాలు... హత్యా ఆత్మహత్యా...?

|
Google Oneindia TeluguNews

కృష్టా జిల్లాలో మూడు మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. విస్సన్నపేట శివారులోని చెట్ల పొదల్లో సోమవారం(అక్టోబర్ 5) ఉదయం మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగుచూసింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతుల్లో ఒక మహిళ,యువతితో పాటు ఓ యువకుడు ఉన్నారు.

వీరిని నూజివీడు మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన చిన్నస్వామి,తిరుపతమ్మ,మీనాక్షిలుగా గుర్తించారు. ఈ ముగ్గురు కుటుంబ సభ్యులేనని సమాచారం. మృతదేహాలకు సమీపంలో వారి ఆటో ట్రాలీ కూడా ఉంది. ఇది హత్యా లేక ఆత్మహత్య అన్నది ఇప్పటికైతే తేలలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

suicide or murder three suspicious deaths in krishna district

సంచార చిరువ్యాపారం చేసుకునే వీరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా... లేక ఎవరైనా హత్యకు పాల్పడ్డారా కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recommended Video

YS Jagan Opens Refurbished Bapu Museum In Vijayawada | Oneindia Telugu

విజయవాడలోని అజిత్‌సింగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దేవీనగర్‌లోనూ ఓ వివాహిత అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది.భర్త రామకృష్ణే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు.తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Police found three dead bodies in suspicious manner on Monday early morning near vissannapet in Krishna District.Deceased were identified as Tirupatamma,Meenakshi,Chinnaswamy,three are belongs to same family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X