విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంజాయి పాత్రుడు, బోండం అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్‌లో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరగుండు, గంజాయిపాత్రుడు, బోండం అంటూ సెటైర్లు వేశారు. ఆ ముగ్గురిని టార్గెట్ చేసి మరీ కామెంట్ చేశారు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ యుద్దమే జరుగుతుంది.

బడుద్దాయి కొడుకుని నర్సీపట్నంలో గెలిపించాలి, వైజాగ్ రాజధాని కాకుండా ఉంటే అక్కడి ఖనిజాలు దోచుకున్నా, భూములు ఆక్రమించినా ఎవరికీ తెలియదు, ఉత్తరాంధ్ర పేదరికం అలాగే ఉండాలి అనేవి గంజాయిపాత్రుడి కోరికలని విజయసాయి రెడ్డి వివరించారు. ఇవీ అయ్యన్నపాత్రుడిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు.

 vijaya sai reddy has criticize tdp leaders

బోండం ఒరిజినల్ వ్యాపారం చిత్తు కాగితాలు ఏరుకోవడం అని, దుర్గగుడి వద్ద సైకిలు బెల్లులు కొట్టేసి, ఆ డబ్బుతో కాల్ మనీ వ్యాపారం చేస్తుంటాడని వివరించారు. గంజాయిపాత్రుడు, బోండం, దెందులూరులో కోడిపందాల కాంతారావు వంటి తుక్కును పెంచి పోషించిన దుర్మార్గం 40 ఏళ్ల ఇండస్ట్రీదేనని ఇండైరెక్టుగా కామెంట్ చేశారు.

అయ్యన్నపాత్రుడు, బోండ ఉమా ఇతర టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. ఒక్కొక్కరినీ ఒకలా కామెంట్ చేశారు. వారి నేపథ్యం ఇలా ఉందన్నారు. వారే తమపై ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

English summary
ycp mp vijaya sai reddy has criticize tdp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X