ఎలా ఓడిపోయాడో తెలియదంట ... పూర్తిగా మారిపోయానని కొత్త డ్రామాలు : చంద్రబాబుపై సాయి రెడ్డి వ్యంగ్యం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడికి చిత్తుగా ఓడిపోయి రెండేళ్లు అవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట అంటూ సెటైర్లు వేశారు . అంతేకాదు బాబు గారు సీఎంగా లేకపోవడం వల్ల తెలుగు దళారీ పార్టీ బ్రోకర్లకు లోటే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయ సాయి రెడ్డి.
భూమా అఖిల ప్రియ అరెస్ట్ తో మారుతున్న ఆళ్లగడ్డ రాజకీయం .. రంగంలోకి మౌనికా రెడ్డి
చంద్రబాబు విభజించు పాలించు సిద్ధాంతాలు బ్రిటిష్ వారిని మించిపోతున్నాయి
సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి బీసీలు, దళితులు ఐక్యంగా ఉంటే చంద్రబాబుకు కడుపుమంట అని వ్యాఖ్యానించారు. అందుకే వాళ్లలో వాళ్లకే చిచ్చు పెడుతూ చంద్రబాబు చోద్యం చూస్తున్నారు అంటూ విమర్శించారు. అది పలాస అయినా వెలగపూడి అయినా చంద్రబాబు విభజించు పాలించు సిద్ధాంతాలు బ్రిటిష్ వారిని మించిపోతున్నాయని పేర్కొన్నారు. దిగజారుడు రాజకీయాలు చేయడానికి ఇది బ్రిటిష్ వారి కాలం కాదు చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు సాయి రెడ్డి.
బాబు సీఎంగా లేకుంటే తెలుగు దళారీ పార్టీ టీడీపీకి బ్రోకర్లకు లోటే
అంతేకాదు రాష్ట్రంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు వెల్లువెత్తుతున్నాయి అని పేర్కొన్న విజయసాయిరెడ్డి బాబు గారు సీఎంగా లేకపోవడంతో తెలుగు దళారీ పార్టీ టీడీపీకి బ్రోకర్లకు లోటే అంటూ వ్యాఖ్యానించారు. కరోనా పై కరాటే లాంటి స్కీములు పెట్టి కోట్లు కొట్టేయకుండానే కరోనా కంట్రోల్ అవుతుంది . దళారులు లేకుండానే సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయి అంటూ విజయసాయిరెడ్డి టీడీపీని టార్గెట్ చేసి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్ల అవినీతి జరిగిందని విమర్శలు గుప్పించారు.
ఎన్నిసార్లు మారతారు బాబు గారు
చిత్తుగా ఓడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట సంక్రాంతి సృష్టికర్త అని చెప్పుకునే బాబు గారికి అంటూ సెటైర్లు వేసిన విజయసాయి పైగా పూర్తిగా మారిపోయాను అంటూ సారీ చెప్పి కొత్త డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారు అంటూ ప్రశ్నించారు. దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్ని నిందిస్తున్నాడు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు.
రైతులు లాభపడితే మీకంత కడుపు మంట దేనికి
మొన్నటికి
మొన్న
రాష్ట్రం
ఇచ్చిన
జీవోలను
భోగిమంటల్లో
వేయమంటారేంటి
చంద్రబాబు
అంటూ
ప్రశ్నించిన
విజయ
సాయి
రెడ్డి
హెరిటేజ్
కంపెనీ
ఆదాయం
తగ్గిన
లక్షలాది
రైతులకు
లాభం
జరిగింది
గా..
రైతులు
లాభపడితే
మీకంత
కడుపు
మంట
దేనికి
అంటూ
మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షీర విప్లవానికి స్వాగతం చెప్పడంతో మన జాతి మొత్తానికి ఒక ఉదాహరణగా నిలిచింది అని పేర్కొన్న విజయ సాయి రెడ్డి పాడి రైతులు పేదరికంపై విజయం సాధించేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకుని శ్రమకు తగ్గ ఆదాయం సాధించేలా సీఎం జగన్ చేశారని తెలిపారు. అమూల్ రాకతో వరి పండించే రైతులు మాత్రమే కాదు పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.