దేశంలోని క్రిమినల్స్ తో సంబంధాలున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - బుద్దా వెంకన్న
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు . జగన్ అప్పుడే గెలిచేశామనే భ్రమలో ఉన్నారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న అన్నారు. దేశంలోని అందరు నేరస్తులతో సత్సంబంధాలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు .
మెరుగైన సమాజ ఉద్యమకారుడి ప్రయాణం: హైదరాబాద్ టు ముంబై వయా కర్ణాటక!
దేశంలోని నేరస్తులతో సత్సంబంధాలు ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అన్న బుద్దా వెంకన్న
విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో నేరస్తులతో జగన్ కు సత్సంబంధాలున్నాయన్న బుద్దా వెంకన్న క్రిమినల్స్కు, వైఎస్ జగన్కు మధ్య సమాచారాన్ని అందించే వారధిలా విజయసాయిరెడ్డి ఉన్నారని పేర్కొన్నారు . జగన్ చేసినంత అవినీతి దేశంలో మరెవ్వరు చేసి ఉండరని ఆయన అన్నారు . అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు జగన్, మోడీతో కలిశారన్నారుకేసులను కొట్టి వేయించుకునేందుకు తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రధాని మోడీ కాళ్లపై పెట్టిన ఘనత ఒక్క జగన్కే దక్కుతుందన్నారు . జగన్ కేసుల దర్యాప్తును మోడీ అడ్డుకుంటున్నారన్నారు.
23 తరువాత జగన్ ఇడుపులపాయకే పరిమితం అవుతారన్న బుద్దా వెంకన్న
మాటల గారడీతో ప్రజలను మోడీ మోసగించారన్నారు. చంద్రబాబుపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడిన బుద్దా వెంకన్న మోడీ వైఫల్యాలపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మోడీతో కలిసే జగన్ రాష్ట్రం మీద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 23 తర్వాత జగన్ ఇడుపులపాయకే పరిమితమవుతారన్నారు. ఈ ఎన్నికల్లో మోడీ, జగన్ ఓడిపోవడం ఖాయమని బుద్దా వెంకన్న అన్నారు. ఇక ఈ నేపధ్యంలోనే జగన్పై ఉన్న కేసులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదన్నారు.
మోడీ ఓటమికి వైఎస్ జగన్ తో దోస్తీ కూడా ఒక కారణం అన్న బుద్దా వెంకన్న
దోపిడీ దారుడిగా, ముఖ్యంగా ప్రజల డబ్బును దోచుకున్నటువంటి వ్యక్తిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముద్రపడ్డాడని, అటువంటి వ్యక్తితో ప్రధాని మోడీ దేశంలో అధికారం కోసం లాలూచీ పడి ఆయన పతనాన్ని ఆయనే కొని తెచ్చుకున్నాడని బుద్దా వెంకన్న అన్నారు. ఈ దఫా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కనీసం 70 - 80 అసెంబ్లీ స్థానాలు కూడా వచ్చే అవకాశాలు లేవని మీడియా చానెళ్లే చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక రకంగా మోడీ ఓటమి చెందబోతుండటానికి వైఎస్ జగన్ తో దోస్తీ ఒక ముఖ్య కారణం కాబోతున్నదని ఆయన అన్నారు