మీకో న్యాయం- ఓటర్లకో న్యాయమా ?- అద్దాల ఛాంబర్లో నిమ్మగడ్డ ప్రెస్మీట్పై వైసీపీ ట్రోలింగ్
ఏపీలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని తాము కోరుతున్నా పట్టించుకోకుండా నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్పై వైసీపీ ఫైర్ అవుతోంది. ఎన్నికల నిర్వహణకు కరోనా పరిస్ధితులు అడ్డంకిగా ఉన్నా పట్టించుకోకుండా ఎస్ఈసీ ముందుకెళ్లడంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇవాళ నిమగడ్డ రమేష్ కోవిడ్ భయాలతో గ్లాస్ ఛాంబర్లో ప్రెస్మీట్ నిర్వహించడాన్నీ తప్పుబడుతున్నారు.
ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి.. సురభి పిక్స్ వైరల్
రాష్ట్రంలో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరినా పట్టించుకోకుండా అద్దాల ఛాంబర్లో కూర్చుని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై వైసీపీ సోషల్ మీడియా కూడా ట్రోల్ చేస్తోంది. మీరు మాత్రం అద్దాల ఛాంబర్లో ప్రెస్మీట్లు పెడతారు, అధికారులు, ఓటర్లు మాత్రం క్యూలో నిలబడి ఓట్లేయాలా, ఎన్నికలు నిర్వహించాలా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ట్వీట్లు, పోస్టులు కనిపిస్తున్నాయి.
కరోనా భయాలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అద్దాల ఛాంబర్లో కూర్చుని ప్రెస్మీట్ నిర్వహించారు. మీడియా మైకులను మాత్రమే గ్లాస్ ఛాంబర్లో నుంచి లోపలికి అనుమతించారు. దీంతో మీరు మాత్రం గ్లాస్ ఛాంబర్లో కూర్చుని ప్రెస్మీట్లు పెడుతూ జనం ప్రాణాల్ని కరోనాకు పణంగా పెట్టాలనుకుంటున్నారా అంటూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని ఉద్యోగులు కోరుతుంటే నిమ్మగడ్డ మాత్రం మొండిగా ముందుకెళ్తున్నారని వైసీపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.