నాలుగు రోజులు, రెండు అల్ప పీడనాలు.. దక్షిణాది రాష్ట్రాలపై ఎఫెక్ట్
విశాఖపట్నం : నాలుగు రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలకు అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గురువారం (డిసెంబర్ 6) ఒక అల్పపీడనం ఏర్పడేలా ఛాన్సుందని చెప్పారు. మరొకటి ఈనెల 9న ( ఆదివారం) ఏర్పడొచ్చని వివరించారు. ఈ రెండు అల్పపీడనాల కారణంగా దక్షిణాది రాష్ట్రాల తీరాలపై రానున్న 3 రోజులు ఎఫెక్ట్ ఉంటుందన్నారు.
బలమైన గాలులు కూడా వీచే ఛాన్సుందని తెలిపారు. తీరప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. గురువారం, శుక్రవారం.. ఈ రెండు రోజుల్లోనూ రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్సుందన్నారు.
Comments
English summary
The weather department officials said that in the four days, there will be two low thrusts in the Bay of Bengal. This will be the effect of 3 days coming on the coastal areas of Southern States.
Story first published: Thursday, December 6, 2018, 9:07 [IST]