మరో నవరత్నాల హామీకి శ్రీకారం .. నేడు విజయనగరంలో జగనన్న వసతి దీవెన ప్రారంభం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నవరత్నాల హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాఠశాల, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'అమ్మ ఒడి' ద్వారా చదువుకోవటానికి ఆర్ధిక భరోసా ఇస్తున్న ఏపీ సర్కార్ వృత్తి విద్యా కోర్సులు చేసే వారి కోసం కూడా వారికి అండగా ఉండే పథకాన్ని అందించనుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ఉన్నత విద్యాకోర్సులు చదువుతున్నవారి కోసం 'జగనన్న వసతిదీవెన' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ నేడు విజయనగరం వేదికగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
నిన్న కాపు నేస్తం .. నేడు జగనన్న చేదోడు .. వారికి ఏడాదికి రూ. 10వేల ఆర్ధిక సాయం
విజయనగరంలో నేడు జగనన్న వసతిదీవెన ప్రారంభం
వృత్తి
విద్యాకోర్సులు
అభ్యసించే
వారికి
ఆర్ధిక
భరోసా
ఇవ్వాలని
నిర్ణయం
తీసుకున్న
సీఎం
జగన్
పూర్తిగా
ఫీజు
రీయింబర్స్మెంట్తో
పాటు
వసతి,
భోజన
ఖర్చుల
నిమిత్తం
ఏడాదికి
రూ.
10
వేల
నుండి
రూ.20
వేల
చొప్పున
ఇస్తామని
హామీ
ఇచ్చారు.
ఇక
ఈ
హామీ
మేరకు
ఈ
కార్యక్రమాన్ని
సోమవారం
విజయనగరంలో
ప్రారంభిస్తున్నారు
జగన్
.
అయితే
ఉన్నత
విద్యాకోర్సుల
వారే
కాకుండా
ఐటీఐ,
పాలిటెక్నిక్
కోర్సుల
విద్యార్థులకు
జగనన్న
వసతి
దీవెన
పథకం
వర్తింపజేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి స్కీమ్ ..జగనన్న వసతి దీవెన కార్డుల అందజేత ..
ఇక బియ్యం కార్డు, వైఎస్సార్ పింఛన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులతో పాటు జగనన్న విద్యాదీవెన కార్డు , జగనన్న వసతి దీవెన కార్డు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు జగనన్న వసతి దీవెన కార్డులను పంపించిన అధికార యంత్రాంగం నేడు సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించాక అధికారికంగా పంపిణీ చెయ్యనున్నారు . మంగళవారం నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబ్దిదారులైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఈ కార్డును అందజేస్తారు. ఈ కార్డుతో పాటు ముఖ్యమంత్రి సందేశపత్రం కూడా అందిస్తారు.
సీఎం పర్యటన సదర్భంగా విజయనగరంలో భారీ ఏర్పాట్లు
నేడు
జగనన్న
వసతి
దీవెన
విజయనగరంలో
ముఖ్యమంత్రి
జగన్మోహన్రెడ్డి
ప్రారంభం
చెయ్యనున్న
సందర్భంగా
పోలీస్
బ్యారెక్స్
నుంచి
అయోధ్య
మైదానం
వరకు
నాలుగు
కిలోమీటర్ల
పొడువున
సీఎంకు
స్వాగతం
పలికేందుకు
తొమ్మిది
నియోజకవర్గాల
నుంచి
పెద్ద
సంఖ్యలో
ప్రజలు
పాల్గొంటున్నారు
.
ఉదయం
11:15
గంటలకు
అయోధ్య
మైదానంలో
ఏర్పాటు
చేసిన
బహిరంగ
సభలో
పాల్గొని
‘జగనన్న
వసతి
దీవెన'
కార్యక్రమాన్ని
జగన్
ప్రారంభించనున్నారు.