విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో నవరత్నాల హామీకి శ్రీకారం .. నేడు విజయనగరంలో జగనన్న వసతి దీవెన ప్రారంభం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నవరత్నాల హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'అమ్మ ఒడి' ద్వారా చదువుకోవటానికి ఆర్ధిక భరోసా ఇస్తున్న ఏపీ సర్కార్ వృత్తి విద్యా కోర్సులు చేసే వారి కోసం కూడా వారికి అండగా ఉండే పథకాన్ని అందించనుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ఉన్నత విద్యాకోర్సులు చదువుతున్నవారి కోసం 'జగనన్న వసతిదీవెన' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ నేడు విజయనగరం వేదికగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

నిన్న కాపు నేస్తం .. నేడు జగనన్న చేదోడు .. వారికి ఏడాదికి రూ. 10వేల ఆర్ధిక సాయంనిన్న కాపు నేస్తం .. నేడు జగనన్న చేదోడు .. వారికి ఏడాదికి రూ. 10వేల ఆర్ధిక సాయం

 విజయనగరంలో నేడు జగనన్న వసతిదీవెన ప్రారంభం

విజయనగరంలో నేడు జగనన్న వసతిదీవెన ప్రారంభం


వృత్తి విద్యాకోర్సులు అభ్యసించే వారికి ఆర్ధిక భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ. 10 వేల నుండి రూ.20 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని సోమవారం విజయనగరంలో ప్రారంభిస్తున్నారు జగన్ . అయితే ఉన్నత విద్యాకోర్సుల వారే కాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సుల విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం వర్తింపజేస్తున్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి స్కీమ్ ..జగనన్న వసతి దీవెన కార్డుల అందజేత ..

రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి స్కీమ్ ..జగనన్న వసతి దీవెన కార్డుల అందజేత ..

ఇక బియ్యం కార్డు, వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డులతో పాటు జగనన్న విద్యాదీవెన కార్డు , జగనన్న వసతి దీవెన కార్డు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు జగనన్న వసతి దీవెన కార్డులను పంపించిన అధికార యంత్రాంగం నేడు సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించాక అధికారికంగా పంపిణీ చెయ్యనున్నారు . మంగళవారం నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబ్దిదారులైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఈ కార్డును అందజేస్తారు. ఈ కార్డుతో పాటు ముఖ్యమంత్రి సందేశపత్రం కూడా అందిస్తారు.

సీఎం పర్యటన సదర్భంగా విజయనగరంలో భారీ ఏర్పాట్లు

సీఎం పర్యటన సదర్భంగా విజయనగరంలో భారీ ఏర్పాట్లు


నేడు జగనన్న వసతి దీవెన విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభం చెయ్యనున్న సందర్భంగా పోలీస్ బ్యారెక్స్ నుంచి అయోధ్య మైదానం వరకు నాలుగు కిలోమీటర్ల పొడువున సీఎంకు స్వాగతం పలికేందుకు తొమ్మిది నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు . ఉదయం 11:15 గంటలకు అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ‘జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు.

English summary
AP CM Jagan Mohan Reddy has pledged to implement another Navaratna promises. AP Sarkar will also provide a scheme for those who take vocational courses. CM Jagan, who has initiated the Jagananna vasathi deevena scheme for those who are pursuing higher education courses such as ITI, Polytechnic and Degree, will launch the program at Vijayanagaram today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X