విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్జీటీ ఆదేశాలను, ఏడు కమిటీల ఏర్పాటును సవాల్ చేసిన ఎల్జీపాలిమర్స్ .. సుప్రీంలో ఆసక్తికర వాదన

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ సంఘటనపై వివరణ కోరుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చెయ్యటంతో పాటు ప్రాణ నష్టం కోసం రూ .50 కోట్ల మధ్యంతర మొత్తాన్ని డిపాజిట్ చెయ్యాలని ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన విషయం తెలిసిందే . ఇక ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ, అలాగే గ్యాస్ లీక్ ఘటనపై 7 విచారణ కమిటీల ఏర్పాటును సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ సుప్రీం ధర్మాసనాన్నిఆశ్రయించింది . ఇక ఈరోజు ఈ పిటీషన్ పై విచారణ జరిగింది.

 vizag gas leak .. ఎన్జీటీ ఆదేశాలతో రూ.50 కోట్లు డిపాజిట్ చేసిన ఎల్జీ పాలిమర్స్ vizag gas leak .. ఎన్జీటీ ఆదేశాలతో రూ.50 కోట్లు డిపాజిట్ చేసిన ఎల్జీ పాలిమర్స్

నోటీసులు ఇవ్వటానికి తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం

నోటీసులు ఇవ్వటానికి తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం


జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు కొనసాగాయి . వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్జీటీలో వాదనలు వినిపించాలని ఎల్జీ పాలిమర్స్‌ను ఆదేశించింది. అంతేకాదు నోటీసులు ఇవ్వకుండా తిరస్కరించి పెట్టి తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది . ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో లేని అంశం అని ఎల్జీ పాలిమర్స్ తరపున ముకుల్ రోత్గి వాదనలు వినిపించారు . అయితే విషవాయువు లీకేజ్ దుర్ఘటన కచ్చితంగా పర్యావరణ అంశం అని ఎన్జీటీ పరిధిలోకే వస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది .

విచారణకు ఏడు కమిటీలు అవసరమా ? ఒక్క కమిటీ చాలని వాదన

విచారణకు ఏడు కమిటీలు అవసరమా ? ఒక్క కమిటీ చాలని వాదన

అంతేకాదు ఇక విషవాయువు లీకేజీ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు మొత్తం 7 కమిటీలను వేశారని, అన్ని కమిటీల విచారణ అవసరమా ?కేవలం ఒక్క కమిటీ విచారణ చాలన్నదే మా వాదన అని ఎల్జీ పాలిమర్స్ తరపున ముకుల్ రోత్గి వాదించారు . సుమోటోగా ఇలాంటి అంశాలపై ఎన్జీటీ ఆదేశాలు జారీచేయడం, విచారణ జరపడం చేయవచ్చా అన్నదే మా ప్రశ్న అని ఆయన సుప్రీం ధర్మాసనం ముందు తమ వాదన ఉంచారు ముకుల్ రోత్గి.

Recommended Video

Vizag Gas Leak: LG Polymers' Application for Environmental Permit, Environmental Clearance Confusion
ఎన్జీటీ లో తమ వాదన వినిపించాలని సూచించిన సుప్రీం కోర్ట్

ఎన్జీటీ లో తమ వాదన వినిపించాలని సూచించిన సుప్రీం కోర్ట్


అయితే ఆర్‌ఆర్ వెంకటపురంలోని తన ప్లాంట్‌లో గ్యాస్ లీక్‌పై దర్యాప్తు జరిపేందుకు ఏడు కమిటీలను వేయటాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపి కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, సెంట్రల్ పిసిబి, కేంద్రానికి నోటీసులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే జూన్ 1వ తేదీన ట్రిబ్యునల్ జరిపే తదుపరి విచారణలో వాదనలు వినిపించుకొనేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది సుప్రీంకోర్టు . ఎన్జీటీ ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్న కారణంగా జూన్ 1న తదుపరి విచారణ ఉన్నందున, ఈ లోగానే చట్టపరమైన పలు అంశాలపై అభిప్రాయాలను, అభ్యంతరాలను వివరించాలని ఎల్జీ పాలిమర్స్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు.

English summary
The Supreme Court on Tuesday refused to issue notices to the AP Pollution Control Board, Visakhapatnam District Collector, Central PCB and the Centre on a petition filed by LG Polymers objecting to the constitution of seven committees to probe the gas leak at its plant in RR Venkatapuram in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X