విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా పేరు చెప్పి భూ సెటిల్‌మెంట్లు చేస్తే ఎవ్వర్నీ వ‌ద‌ల‌ను : ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్

|
Google Oneindia TeluguNews

విశాఖలో భూ కబ్జాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. భూ ఆక్రమణల ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భూ అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ,సొంత పార్టీ నేతలే అయినా సరే క్షమించేది లేదని జగన్ చెప్పారని విజయ సాయి రెడ్డి తెలిపారు.

వికేంద్రీకరణతో అమరావతికి నష్టం ఏం లేదన్న ఎంపీ విజయసాయి: అమరావతి భూములు అమ్ముతారా టీడీపీ ఫైర్ !!వికేంద్రీకరణతో అమరావతికి నష్టం ఏం లేదన్న ఎంపీ విజయసాయి: అమరావతి భూములు అమ్ముతారా టీడీపీ ఫైర్ !!

విశాఖలో నా పేరు చెప్పి భూములు సెటిల్మెంట్లు చేస్తూ ఎవరైనా సరే వదలను అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. భూ ఆక్రమణలు వ్యవహారాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సొంత పార్టీ నాయకులు ఎవరు ఉన్నా సరే క్షమించేది లేదని స్పష్టం చేశారు. తన పేరు ఉపయోగించి సెటిల్మెంట్లు చేసే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తానని విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు ఇలా ఏ ఇతర భూముల జోలికి వచ్చినా వదిలేది లేదన్నారు. ప్రశాంత విశాఖనగరం తమ లక్ష్యమని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

 MP Vijayasai warn .. never leave anybody using my name in land grabbings

విజయసాయి రెడ్డి పేరు చెప్పి విశాఖకు చెందిన వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి భూదందాలు చేస్తున్నారని దీంతో కొయ్య ప్రసాద్ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసిపి అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా చర్యలలో భాగంగా ప్రసాద్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో తాజాగా మరోమారు విజయసాయిరెడ్డి విశాఖలో భూ దందాపై మాట్లాడారు. తన పేరు చెప్పి భూ దందాలు చేస్తే క్షమించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Recommended Video

Ram Pothineni సంచలన ట్వీట్స్, ఏదో కుట్ర జరుగుతోందని..!! || Oneindia Telugu

English summary
YCP Rajya Sabha member Vijayasai reddy warned never leave anybody who is using my name in Visakhapatnam and make land settlements. Ministers, MLAs, MPs and own party leaders also no excuse for land grabbing. Vijayasai Reddy has warned that he will file cases and arrest those who make settlements using his name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X