నరేంద్ర మోడీ విశాఖ పర్యటన: యూటర్న్, పుల్వామా ఘటన: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మోడీ
విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖలో పర్యటిస్తున్నారు. మోడీ పర్యటనకు రెండు రోజుల ముందు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన సానుకూలంగా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు, మోడీ పర్యటనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Newest First Oldest First
వరైతే అవినీతి, అక్రమాలకు పాల్పడతారో వారే నిత్యం భయపడతారని ప్రధాని మోడీ.. చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. మాది అంతా పారదర్శక పాలన అని, అందుకే దేనికీ భయపడమని చెప్పారు. తాము అంకితభావంతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇక్కడి నేతలు ప్రతిసారి యూటర్న్ తీసుకుంటున్నారని చెప్పారు. ఇక్కడి నాయకులు అనేక అవినీతి పనులు చేశారని చెప్పారు. ఇక్కడి పాలకులు కుటుంబ పాలనను వ్యవస్థీకృతం చేశారన్నారు. ఈ నేతలు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మోడీని తిడుతున్నారన్నారు.
ఏ ఒక్క అంశాన్ని అయినా పూర్తిగా అమలు చేశారా అంటూ యనమల నిలదీశారు. చట్టానికి తూట్లు పొడిచే అధికారం వారికెక్కడిదన్నారు. ఏపీకి నమ్మకద్రోహం చేస్తే వారికి ఏం లాభమో విశాఖలో అడుగు పెట్టేముందే ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మోసానికి ప్రతిరూపం, నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం మోడీ అన్నారు.
READ MORE
Comments
narendra modi visakhapatnam andhra pradesh lok sabha elections 2019 andhra pradesh assembly elections 2019 bjp bharatiya janata party నరేంద్ర మోడీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లోకసభ ఎన్నికలు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019 బీజేపీ
English summary
Prime Minister Narendra Modi Visakhapatnam tour live updates. Two days before Centre announced Visakhapatnam railway zone.