విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ యువతుల మిస్సింగ్ కేసు సుఖాంతం: బెంగళూరులో తేలిన అక్కాచెల్లెళ్లు..

|
Google Oneindia TeluguNews

మూడురోజుల క్రితం విశాఖపట్టణంలో కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్ల ఆచూకీ దొరికింది. విశాఖలో మాయమై.. బెంగళూరులో తేలారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లి.. అటు నుంచి బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. మొబైల్ లోకేషన్ ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి వైజాగ్ తీసుకొస్తున్నారు.

ఈ నెల 18వ తేదీన కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్లు తమ గురించి వెతకొద్దని తల్లికి మేసెజ్ చేశారు. దీంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. వెంటనే ద్వారకా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి.. అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు మొబైల్ లోకేషన్ ఆధారంగా బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పేరెంట్స్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారు ఎందుకు పారిపోయారనే అంశంపై క్లారిటీ లేదు. ఈ అంశంపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.

same family three girls are safe in bangalore..

అక్కాచెల్లెళ్లు ఎందుకు వెళ్లిపోయారే తెలియకున్నా.. వారు క్షేమంగా ఉన్నారని తెలిసి పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య మనసు కాస్త స్థిమిత పడిందని చెప్తున్నారు. తమ కూతుళ్ల ఆచూకీ కనుకొని అప్పగిస్తోన్న పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారు చేసిన మేలును జన్మలో కూడా మరచిపోలేదని చెప్పారు.

English summary
same family three girls are safe in bangalore. they are went to outside in this month 18th, after that sms to parents don’t search to me
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X