విశాఖ ఏజెన్సీలో దారుణం.. బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
బాలికా సంరక్షణా చట్టాలు ఎన్ని ఉన్నా మృగాళ్ళు ఏ మాత్రం తగ్గటం లేదు. ఏపీలో దిశ వంటి చట్టం ఉన్నా సరే కామాంధులు ఇంకా మారటం లేదు . అభంశుభం తెలియని చిన్నారిపై ఇద్దరు యువకులు అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
బర్త్ డేకి పిలిచి బాలికపై అత్యాచారం .. గర్భం దాలిస్తే మాత్రలు వేసి... ఇద్దరు యువకుల దారుణం
విశాఖ ఏజెన్సీలోజరిగిన ఈ దారుణ ఘటనలో ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. జి.మాడుగుల మండల కె.కోడాపల్లి పంచాయతీ జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. జి. మాడుగుల పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకపక్క కరోనా తో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా అత్యాచారాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి . ప్రభుత్వాలు కఠిన సిస్క్షలు వేస్తామని హెచ్చరించినా వారిలో మాత్రం మార్పు రావటం లేదు. దీంతో అన్నెం పున్నెం తెలియని బాల్యం బలైపోతుంది. మైనర్ బాలికలు కామాంధుల కబంధ హస్తాలలో చిక్కి విలవిలలాడుతున్నారు .ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో పోలీసులు ఈ దారుణానికి కారణమైన వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.