విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గీతం టార్గెట్ గా .. వేల కోట్లు నోట్లకట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా ? ప్రశ్నించిన ఎంపీ

|
Google Oneindia TeluguNews

టిడిపి నాయకుడు, చంద్రబాబుకు బంధువు, బాలయ్య అల్లుడు అయిన భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ నిర్మాణాల కూల్చివేత పై ఏపీలో దుమారం రేగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది కేవలం కక్షసాధింపు చర్య అని చెప్పి విమర్శలు గుప్పిస్తుంటే, అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తే తప్ప అంటూ వైసిపి నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. చంద్రబాబు బంధువు అయితే అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చ కూడదా అని ప్రశ్నిస్తున్నారు.

 విధ్వంసాలతో ఏపీ 'బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా'గా .. గీతం కూల్చివేతలపై చంద్రబాబు ఫైర్ విధ్వంసాలతో ఏపీ 'బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా'గా .. గీతం కూల్చివేతలపై చంద్రబాబు ఫైర్

 తెలుగు జాతి థూ అని ఉమ్మెయ్యాల్సిన సమయం ఇది

తెలుగు జాతి థూ అని ఉమ్మెయ్యాల్సిన సమయం ఇది

చంద్రబాబుని టార్గెట్ చేసి వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పునాది రాయి వేయించి, తను కలలు కన్న రాజధానిని కట్టాల్సిన బాధ్యత జగన్ గారిదని వంద రాళ్ళు వేస్తుంటే, తన బినామీ భూముల భాగోతం బయటకు రాకుండా ఏకంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి తెలుగు జాతి థూ అని ఉమ్మెయ్యాల్సిన సమయం ఇది అంటూ చంద్రబాబును ఉద్దేశించి విజయ సాయి రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆ గేదె చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది

ఆ గేదె చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది

అంతేకాదు గీతం యూనివర్సిటీ కూల్చివేతనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా విమర్శించిన విజయసాయిరెడ్డి 28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది. 2014లో ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూములలో వేల కోట్లు నోట్లకట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా అంటూ పోస్ట్ చేశారు.

అంతేకాదు అక్రమ కట్టడాలను చట్టప్రకారం కూల్చేస్తే పచ్చ బ్యాచ్ మొత్తం నెత్తీనోరు కొట్టుకుంటోంది.

పేదలు చదువుకునే ఆంధ్ర యూనివర్సిటీని గురించి ఒకరు మాట్లాడలేదు

పేదలు చదువుకునే ఆంధ్ర యూనివర్సిటీని గురించి ఒకరు మాట్లాడలేదు

ఆంధ్ర యూనివర్సిటీ దెయ్యాల కొంపని సదరు అక్రమదారుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకునే ఆంధ్ర యూనివర్సిటీని గురించి ఒకరు మాట్లాడలేదు . పేదల ప్రయోజనాల కన్నా పచ్చ నాయకుని ప్రయోజనాలు ఎక్కువైపోయాయా అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీని నాశనం చేసి, గీతం యూనివర్సిటీ ని ప్రోత్సహించడంతోనే పరిస్థితి ఈ విధంగా మారిందని, పేదల చదువుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఈ వ్యాఖ్యల ద్వారా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Recommended Video

Vizag : Gitam University కూల్చివేత పై భగ్గుమన్న మాజీ ముఖ్యమంత్రి.. | Oneindia Telugu
పుట్ట పగలుతుంటే తట్టుకోలేకపోతోంది

పుట్ట పగలుతుంటే తట్టుకోలేకపోతోంది

అంతేకాదు పాలనాధికారం అంటే ప్రజలకు సేవచేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. కానీ పచ్చ పార్టీ దీనికి భిన్నం . దోపిడీలు ,ఆక్రమణలు ,తవ్వకాలకు పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది. అందుకే అన్ని రకాల మాఫియాలను ప్రోత్సహించింది. ఇప్పుడు పుట్ట పగలుతుంటే తట్టుకోలేకపోతోంది అంటూ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. గీతం యూనివర్సిటీ కూల్చివేత పై టిడిపి నాయకుల వ్యాఖ్యలకు ఆయన సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

English summary
YCP MP Vijaya Sai Reddy is targeting Chandrababu. Vijaya Sai Reddy slammed Chandrababu, saying that the tdp leader said Andhra University is a demon-house.Then No one talked about the Andhra University where the poor were educated. He questioned whether the interests of the tdp chief outweighed the interests of the poor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X