విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ గురువు కోసం కదిలొచ్చిన గ్రామం .. కాళ్ళు కడిగి, పూజలు చేసి భుజాలపై ఊరేగించి ఘనంగా వీడ్కోలు సంబరం

|
Google Oneindia TeluguNews

తల్లి ,తండ్రి, గురువు దైవం తో సమానం అంటారు. అలాంటి దైవ సమానమైన గురువును గుండెల్లో పదిలంగా పెట్టుకుంది ఓ గ్రామం. పదేళ్ల పాటు ఓ మారుమూల కుగ్రామంలో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆ గురువును భుజాలపైకి ఎక్కించుకొని ఊరంతా తిప్పి పండుగ చేశారు ఆ గ్రామస్తులు. ఇంతకీ ఆ గురువు చేసింది ఏంటి? గురువుని ఇంతగా గౌరవించిన ఆ గ్రామం ఎక్కడ ఉంది? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

ఆ జిల్లా పరిషత్ స్కూలు టీచర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు .. విశ్వగురువుగా గుర్తింపు .. రూ. 7కోట్ల నగదుఆ జిల్లా పరిషత్ స్కూలు టీచర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు .. విశ్వగురువుగా గుర్తింపు .. రూ. 7కోట్ల నగదు

మారుమూల కుగ్రామంలో10 ఏళ్లపాటు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయుడు

మారుమూల కుగ్రామంలో10 ఏళ్లపాటు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయుడు

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మల్లుగూడ ఒక గిరిజన గ్రామం. ఈ గ్రామంలో 2011 నుండి ప్రభుత్వ పాఠశాలలో గౌడు నరేంద్ర అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. గ్రామంలోని పాఠశాల శిధిలావస్థకు చేరుకున్నా , పాఠశాలకు సరైన భవనం లేకపోయినా చెట్ల నీడలో, శిధిలమైన షెడ్డులోనే విద్యా బోధన చేశారు. మల్లు గూడా గిరిజన గ్రామ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. పదేళ్లలో ఏనాడు విద్యార్థులకు విద్యను బోధించడం పట్ల ఆ ఉపాధ్యాయుడు అలసత్వం ప్రదర్శించలేదు.

 వేరే స్కూల్ కు బదిలీ అయిన టీచర్ కు ఘనంగా మరచిపోలేని వీడ్కోలు

వేరే స్కూల్ కు బదిలీ అయిన టీచర్ కు ఘనంగా మరచిపోలేని వీడ్కోలు

తాజాగా ఉపాధ్యాయుడు నరేంద్ర వేరే ప్రాంతానికి సంబంధించిన స్కూల్ కు బదిలీ అయ్యారు. దీంతో గ్రామస్తులంతా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. సంబరాలు జరిపారు. కాళ్లు కడిగి పూజలు చేశారు. ఊరంతా కలిసికట్టుగా వచ్చి ఆయనను భుజాలపై ఎక్కించుకొని ఊరేగించారు. డప్పు చప్పుళ్ళతో , గిరిజన నృత్యాలతో భుజాలపై ఎత్తుకుని ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నరేంద్ర దంపతులకు ఘనంగా సన్మానం చేశారు. ఇక గురువును అత్యంత ఘనంగా గౌరవించి సాగనంపిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 గొప్ప గురువు .. గొప్ప మనసున్న గ్రామస్తులు ..

గొప్ప గురువు .. గొప్ప మనసున్న గ్రామస్తులు ..

గురుతరమైన బాధ్యతను మరిచిపోతున్న గురువులు ఉన్న నేటి రోజుల్లో, గురువులంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులు ఉన్న తరుణంలో ఈ వీడియో అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది . మారుమూల గ్రామమైనా నిత్యం వెళ్లి అక్కడ పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పించటం ఆ గురువు నిర్వహించిన పాత్ర, అలాంటి గురువును గుండెలకు హత్తుకున్న ఆ గ్రామ ప్రజల, విద్యార్థుల ప్రేమ నిజంగా నిరుపమానం. ఇలాంటి గురువుల కాళ్లు కడిగి, పూజలు చేసినా ,భుజాలపై ఎత్తుకుని ఊరేగించినా, ఎంత చేసినా తక్కువే.

English summary
Gowdu Narendra has been working as a teacher in a government school since 2011 in Malluguda tribal village in Gummalakshmipuram zone of Vizianagaram district. Even though the school did not have a proper building, the children were taught tirelessly in the shade of the trees . He recently transferred to another school. The whole village moved and said goodbye to him. They washed his feet, worshiped the teacher with celebrations .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X