పంచాయతీ పోరు .. బొత్సా టార్గెట్ గా విజయనగరం వైసీపీలో ఇంటర్నల్ వార్ .. నెల్లిమర్ల ఎమ్మెల్యే ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే పలు జిల్లాలలో వర్గ విభేదాలతో ఏకగ్రీవాలు చేయడం మంత్రులకు, ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇదే సమయంలో విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పై వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వైసిపి వర్గాల్లోనూ, ఇతర రాజకీయ పార్టీల లోనూ ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.
Recommended Video
జగన్ సర్కార్ కు నిమ్మగడ్డ మరో షాక్ .. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మరో ఎన్నికల నగారా?
బొత్సా సోదరుడు టీడీపీతో కలిసి ఏకగ్రీవాలను అడ్డుకుంటున్నారన్న ఎమ్మెల్యే
మంత్రి బొత్స సత్యనారాయణ పై ఆయన సమీప బంధువు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు నెల్లిమర్ల నియోజకవర్గం లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలతో కలిసి విపరీతంగా డబ్బులు పంచి ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు.
అన్నదమ్ములకి, వదినకి పదవులున్నా సంతృప్తి లేదా అని బొత్సా సోదరుడిపై ఫైర్
గత ఎన్నికల్లో తనకు వచ్చిన 30 వేల మెజారిటీ చూసి ఓర్వలేక రాజకీయ చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రమంతా పరిస్థితి ఒకలా ఉంటే తన నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బడుకొండ అప్పలనాయుడు . అన్నదమ్ములకి, వదినకి పదవులున్నా సంతృప్తి చెందకుండా లక్ష్మణరావు రాజకీయ ఉన్మాదిగా మారారని, తన నియోజకవర్గంలో రాజకీయంగా చిచ్చు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు నెల్లిమర్ల ఎమ్మెల్యే.
బొత్స సత్యనారాయణ తన సోదరుని కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడిన ఎమ్మెల్యే
ఇక
పురపాలక
శాఖ
మంత్రి
బొత్స
సత్యనారాయణ
తన
సోదరుని
కంట్రోల్
చేయలేకపోతున్నారని
మండిపడ్డారు.
ఎన్నికల
తరువాత
తాను
అధిష్ఠానానికి
ఫిర్యాదు
చేస్తానని,
అటోఇటో
తేల్చుకుంటామని
ఎమ్మెల్యే
ఆగ్రహం
వ్యక్తం
చేస్తున్నారు.
పంచాయతీ
ఎన్నికల
నేపథ్యంలో
అధికార
పార్టీలో
పొడసూపుతున్న
వర్గ
విభేదాలు
అటు
పార్టీ
వర్గాలలోనూ,
ప్రతిపక్ష
పార్టీలోనూ
ఆసక్తికరంగా
మారాయి.
ఏకంగా
మంత్రి
బొత్స
సత్యనారాయణ
జిల్లాలోనే
వైసిపి
రెండు
గ్రూపులుగా
మారడం,
తీవ్ర
వ్యాఖ్యలు
చేయడం,
ముఖ్యంగా
బొత్స
సోదరుడిని
టార్గెట్
చేయడం
ప్రాధాన్యత
సంతరించుకుంది.