వరంగల్ హైవేపై రెండు బస్సుల ఢీ: 24 మందికి తీవ్రగాయాలు..
వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ప్రమాదంలో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భోగి పండుగ రోజున ప్రమాదం జరిగింది. పండుగపూట ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాలు దుఖంలో మునిగిపోయారు. ప్రమాదంలో రెండు ఆర్టీసీ బస్సుల ముందుభాగం దెబ్బతిన్నాయి. ఆ ఫోటోలను చూస్తే ప్రమాద తీవ్రత ఏంటో తెలుస్తోంది. బస్సుల్లో ముందుభాగంలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెనక ఉన్నవారికి కాస్త సేఫ్ అయ్యారు. వారికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. అయితే ఏ డ్రైవర్ తప్పు వల్ల ప్రమాదం జరిగిందో తెలియరాలేదు. బస్సుల ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.