వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ హైవేపై రెండు బస్సుల ఢీ: 24 మందికి తీవ్రగాయాలు..

|
Google Oneindia TeluguNews

వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ప్రమాదంలో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

24 members injured in road accident at warangal high way.

భోగి పండుగ రోజున ప్రమాదం జరిగింది. పండుగపూట ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాలు దుఖంలో మునిగిపోయారు. ప్రమాదంలో రెండు ఆర్టీసీ బస్సుల ముందుభాగం దెబ్బతిన్నాయి. ఆ ఫోటోలను చూస్తే ప్రమాద తీవ్రత ఏంటో తెలుస్తోంది. బస్సుల్లో ముందుభాగంలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెనక ఉన్నవారికి కాస్త సేఫ్ అయ్యారు. వారికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. అయితే ఏ డ్రైవర్ తప్పు వల్ల ప్రమాదం జరిగిందో తెలియరాలేదు. బస్సుల ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
24 members injured in road accident at warangal high way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X