వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదమా, విజయమా : చనిపోయి గెలిచిన వార్డుమెంబర్..!

|
Google Oneindia TeluguNews

వరంగల్ : చనిపోయి గెలిచాడు. గ్రామస్థుల హృదయాలు దోచుకుని విజేతగా నిలిచాడు. కానీ గెలుపు తాలూకు ఆనందం పంచుకోవడానికి ఆయన లేడు. ఇదంతా చదవడానికి అదోలా ఉన్నా.. స్టోరీలోకి వెళితే అసలు విషయం బోధపడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఈ ఘటన మనసులను కదిలిస్తోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గార్ల మండలం రాజతండాకు చెందిన బానోతు భాస్కర్ (కాంగ్రెస్ మద్దతుదారుడు)... తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా నిలబడ్డాడు. మూడో వార్డు నుంచి ఎన్నికల బరిలోకి దిగాడు. అయితే సోమవారం నాడు ఎలక్షన్లు జరగాల్సి ఉండగా ఆదివారం నాడు చనిపోయాడు. అనారోగ్యం కారణంగా సరిగ్గా ఎన్నికలకు ఒకరోజు ముందు చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. గ్రామస్థులంతా భాస్కర్ మృతదేహం చూసి చలించిపోయారు.

banothu bhaskar won as ward member even he died

భాస్కర్ చనిపోవడంతో ఆయన ప్రత్యర్థికి పోటీ లేనట్లే కదా. అయితే చనిపోయిన భాస్కర్ కు అత్యధికంగా ఓట్లు వచ్చి గెలుపొందాడు. సోమవారం సాయంత్రం రిలీజ్ చేసిన ఫలితాల్లో భాస్కర్ కు 44 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి శ్రీనివాస్ కు 25 ఓట్లు వచ్చాయి. భాస్కర్ చనిపోయాడని తెలిసి కూడా ఓటర్లు ఆయన వైపే మొగ్గు చూపారు. అతడికే ఓట్లు వేశారు. చనిపోయిన భాస్కర్ వార్డు మెంబర్ గా గెలవడంతో.. ఆయనది అదృష్టమో, దురదృష్టమో అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు.

English summary
Banothu Bhaskar who belongs to warangal district contested as ward member in panchayat elections. But he died on sunday while elections on monday. He got majority votes even he died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X