వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ కార్పొరేషన్‌పై కమల వికాసం..?, జితేందర్ రెడ్డి ధీమా..

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన ఒంటెద్దు పోకడలతో ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఇందుకు దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఫలితాలు ఉదహరణ అని తెలిపారు. వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీని ప్రజలు విశ్వసిస్తున్నారని.. టీఆర్ఎస్‌ను తిరస్కరిస్తున్నారని వివరించారు. ఇదీ తాము చెప్పే అంశం కాదు అని.. గత ఎన్నికల ఫలితాలతో రుజువు అవుతుందని తెలిపారు.

దుబ్బాక, హైదరాబాద్ మాదిరిగానే వరంగల్ కార్పొరేషన్‌లో బీజేపీ విజయం సాధిస్తోందని జితేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ పటిష్టత కోసం వరంగల్‌లో బీజేపీ శక్తి పీఠం సమావేశాలు నిర్వహించగా.. జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఈ విషయం ప్రజలు అందరికీ తెలుసు అని చెప్పారు. ఇదీ దాచితే దాగే అంశం కాదని చెప్పారు.

jp likely win warangal corporation: jithender reddy

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏంటో వరంగల్ నగరంలో ఉన్న గుంతలు పడిన రోడ్ల ద్వారా తెలుస్తోందని చెప్పారు. అవే సజీవ సాక్ష్యాలు అని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. కేసీఆర్ మోసపూరిత విధానాలే బీజేపీని గెలిపిస్తున్నాయని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మోసపూరిత మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ విషయం టీఆర్ఎస్ పార్టీకి కూడా తెలిసిందన్నారు.

English summary
bjp likely win warangal corporation senior leader jithender reddysaid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X